అనుష్క శర్మ సంచలన నిర్ణయం, షాక్ లో ఫ్యాన్స్.. అంతా వాళ్ళకోసమేనట.
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సంచలన ప్రకటన చేసింది. తన ఫ్యూచర్ మూవీ కెరీర్ గురించి.. ఆమో చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.
బాలీవుడ్ భామ అనుష్క శర్మ రబ్ నే బనాది జోడి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అది మొదలు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించింది. బాలీవుడ్ లో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను సాధించింది బ్యూటీ. ఇక కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే .. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించేసింది.
ఇలా పెళ్లి చేసుకుని.. అలా ఓ పాపకు జన్మనించింది అనుష్క శర్మ. దాంతో ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తూ.. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే..పెళ్లి తర్వాత అనుష్క నుంచి రిలీజ్ అయిన సినిమాలు నాలుగే. అయితే ఇవన్నీ పెళ్ళికి ముందే షూట్ చేసినవి.
పెళ్లి తర్వాత నుంచి అనుష్క ఒక్క సినిమా కుడా చేయలేదు. ఒక సినిమాలో మాత్రం గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. అనుష్క తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఫ్యామిలీతో మరింత ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. ఇక ఈమధ్య కాలంలో ఆమె నటించిన సినిమా అంటే.. చెక్ దే ఎక్స్ ప్రెస్. ఈసినిమాతో అనుష్క శర్మ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
anushka Sharma
టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అనుష్క శర్మ నుంచి ఎక్కువ సినిమాలు రావడంలేదు అని ఫ్యాన్స్ తెగ బాదపడుతున్నారు. ఈక్రమంలో ఆమె చేసిన ఓ ప్రకటన ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది.
తాజాగా బాలీవుడ్ లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ.. నా కూతురు వామికకు ఇది చాలా కీలకమైన సమయం. తనను దగ్గరుండి చూసుకోవాలి. విరాట్ కూడా చాలా బాగా చూసుకుంటాడు. కానీ తల్లిగా నా బాధ్యత నేను చేయాలి. అందుకే వామిక, విరాట్ కోసం, నా కుటుంబం కోసం సమయం ఇవ్వడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నారు.
Photo Courtesy: Instagram
ఇకపై ఏడాదికి ఒకటే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం అభిమానులకు బాధ కలిగిస్తుందని తెలుసు. కానీ నా కుటుంబం కోసం నేను సమయాన్ని ఇవ్వాలి. నటిగా, భార్యగా, తల్లిగా, ఓ సెలబ్రిటీగా ప్రతి పాత్రను ఆస్వాదించాను. ప్రస్తుతానికి తల్లి పాత్రలో సంతృప్తిగా ఉన్నాను అని తెలిపింది.
ఇక అనుష్క శర్మ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆమె అభిమానులను మాత్రం నిరాశలోకి నెట్టేసింది. ఇక అనుష్క శర్మ పెళ్ళి.. పిల్లల తరువాత కూడా ఏమాత్రం ఫిట్ నెస్ కోల్పోకుండా.. అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లు కూడా చేస్తోంది బ్యూటీ.