- Home
- Entertainment
- NTR: జూ ఎన్టీఆర్ తల్లిని పిలిపించి ఎన్టీఆర్ చెప్పిన మాట ఏంటో తెలుసా?.. తాతపై కోపంతో రగిలిపోయిన తారక్
NTR: జూ ఎన్టీఆర్ తల్లిని పిలిపించి ఎన్టీఆర్ చెప్పిన మాట ఏంటో తెలుసా?.. తాతపై కోపంతో రగిలిపోయిన తారక్
నందమూరి తారక రామారావు పోలికలతో జన్మించిన జూ ఎన్టీఆర్ కి రామారావే స్వయంగా తన పేరుని పెట్టారు. అయితే ఆ సమయంలో తన తల్లికి, తాతకి మధ్య జరిగిన సంభాషణను తారక్ పంచుకున్నారు.

డ్రాగన్తో బిజీగా ఉన్నా జూ ఎన్టీఆర్
నందమూరి నట వారసుడిగా రాణిస్తున్నారు జూ ఎన్టీఆర్. తాత స్వయంగా పెట్టిన నందమూరి తారక రామారావు పేరుతోనే ఆయన రాణిస్తున్నారు. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం తారక్ `డ్రాగన్` అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీతో తానేంటో సత్తా చాటేందుకు రాబోతున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఎన్టీఆర్ పేరు మార్చిన రామారావు
ఈ క్రమంలో ఎన్టీఆర్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ విషయాన్ని తారక్ స్వయంగా వెల్లడించడం విశేషం. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జూ ఎన్టీఆర్ని తాత వద్దకు తీసుకెళ్లాడట హరికృష్ణ. ఆయన్ని చూడగానే రామారావు గమనించి పిలిచాడట. ఏం పేరు అని అడగ్గా తారక్ రామ్ అని చెప్పాడట. అలా కాదు, నందమూరి తారక రామారావు అని పేరు మార్చండి అని చెప్పాడట. దీంతో హరికృష్ణ అప్పట్నుంచి ఎన్టీఆర్గానే నామకరం చేశారట. ఆ తర్వాత నుంచి ఏడాదిపాటు తాతతోనే ట్రావెల్ చేసినట్టు చెప్పాడు తారక్. తాత, తను మాత్రమే ఉండేవాళ్లమని, తనని ఎంతో బాగా చూసుకున్నాడని, ఆ రోజులు జీవితంలో మర్చిపోలేనని తెలిపారు.
రామారావుకి జూ ఎన్టీఆర్ అమ్మ నుంచి క్యారేజీలు
బ్రహ్మర్షి విశ్వామిత్ర సమయంలో ఆయన నాన్వెజ్ తినలేదు. ఆ సమయంలో తనకోసం నాన్వెజ్ ఏర్పాటు చేయించాడని, తనే స్వయంగా లేపి తినమని చెప్పాడని తెలిపారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయాన్ని జూ ఎన్టీఆర్ వెల్లడించారు. తాను తాతతో క్లోజ్ అయ్యాక తన కోసం క్యారేజీలను అమ్మ పంపించిందని, ఆ ఫుడ్ తిని తాత ఫిదా అయ్యాడని, అప్పట్నుంచి రోజూ అమ్మ నుంచి క్యారేజీ వచ్చేదని చెప్పాడు తారక్. ఈ క్రమంలో ఓ సారి అమ్మని పిలిపించాడట రామారావు. ఇద్దరు కింద కూర్చున్నారు.
జూ ఎన్టీఆర్ అమ్మకి రామారావు చెప్పిన మాట.. తాతపై తారక్కి కోపం
`ఇంతకాలం దూరంగా ఉన్నాము, దాని గురించి మర్చిపోండి. నా వంశోద్ధారకుడు నీ కడుపు పుట్టాడు. నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యతను నువ్వు నిర్వర్తించమ్మ, నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను` అని అన్నాడని, అన్న కొన్ని రోజులకే తాత చనిపోయాడని చెప్పాడు తారక్. అప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని, అప్పుడే తనకు ధైర్యం వచ్చింది. ఉత్సాహం వచ్చింది, ఇక తనకు తిరుగులేదని భావించాను. అంతలోనే చనిపోవడంతో తాతపై చాలా కోపం వచ్చిందని తెలిపారు తారక్. నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పాడు, అంతలోనే అనాథగా వదిలేసి వెళ్లిపోయాడంతో కోపం తట్టుకోలేకపోయానని తెలిపారు. కానీ పెద్దయ్యాక ఇప్పుడు అర్థమవుతుంది, నాకు కావాల్సిన మూడు అక్షరాలు `ఎన్టీఆర్` ఇచ్చాడు, అది చాలు నాకు అనిపించిందని చెప్పాడు తారక్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో జూ ఎన్టీఆర్ ఈ విషయాన్ని పంచుకున్నారు.

