- Home
- Entertainment
- Divvala Madhuri : పవర్ ఫుల్ పాత్రలో దివ్వెల మాధురి, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్
Divvala Madhuri : పవర్ ఫుల్ పాత్రలో దివ్వెల మాధురి, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్
ఏపి పాలిటిక్స్ లో హిటు పుట్టించి, బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న దువ్వాడ మాధురి టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. ఫస్ట్ మూవీలోనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది.

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..
దివ్వెల మాధురి ఆమధ్య కాలంలో ఆంధ్రా పాలిటిక్స్ లో సంచలనం అయ్యింది. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న అనుబంధం వల్ల, రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది మాధురి. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. శ్రీనివాస్ తో రిలేషన్, తిరుమలలో ఫోటో షూట్, పవన్ కళ్యాణ్ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ తో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది మాధురి.
బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ..
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన దువ్వాడ మాధురికి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ లోకి వచ్చీ రావడంతోనే తన నోటికి పదును పెట్టిన మాధురి.. హౌస్ లో కూడా గొడవలకు కారణంగా మారింది. కంటెస్టెంట్స్ పై కామెంట్స్, రివర్స్ ఎటాక్ లతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకుంది మాధురి. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి ఎక్కువ రోజులు నిలబడలకపోయింది.
టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం..
దువ్వాడ మాధురి... అలియాస్ దివ్వెల మాధురి టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. చీన్ టపాక్ డుం డుం’ అనే డిఫరెంట్ టైటిల్తో ఓ కొత్త తెలుగు సినిమా ప్రారంభమైంది. ‘శుభం’, ‘కుమారి శ్రీమతి’ వంటి వెబ్ సిరీస్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈసినిమా.. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం రీసెంట్ గానే ఘనంగా జరిగింది. వై.ఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో బ్రిగిడా సాగా హీరోయిన్గా నటిస్తుండగా, దివ్వెల మాధురి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
గైరమ్మత్త పాత్రలో మాధురి..
ఈ సినిమాలో మాధురి ‘గైరమ్మత్త’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈసినిమా కథను మలుపు తిప్పే క్యారెక్టర్ ను ఆమె పోషిస్టున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఆమె పోస్టర్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. విలేజ్ టాకీస్’ బ్యానర్పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాతో మాధురి టాలీవుడ్ ప్రయాణం మొదలవుతోంది. మరి ముందు ముందు ఆమె ఫిల్మ్ కెరీర్ ఎలా ఉండబోతోందో చూడాలి.

