బిగ్ బాస్ హౌస్లో కుస్తీ పోటీలు.. ఫైర్ అయిన విశ్వ, మానస్.. రొమాన్స్తో రెచ్చిపోయిన హమీదా,
Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో ఐదవ సీజన్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో ఐదవ సీజన్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ప్రతి ఒక్క కంటెస్టెంట్ లు ఎక్కడ కూడా అసలు తగ్గేలా లేరు. ప్రతి ఒక్కరూ ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తున్నారు.ఇప్పటికే 32 ఎపిసోడ్ లు పూర్తవగా.. నిన్నటి ఎపిసోడ్ హైలెట్ ఏమిటో చూద్దాం.
ఈ వారం బిగ్ బాస్ లో రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ ఇవ్వగా అందులో సన్నీ, రవి రెండు రాజ్యాల అధిపతిగా మారారు. ఇంటి సభ్యులను కూడా రెండు భాగాలుగా చేశారు.
కుస్తీ పోటీల కోసం రెండు రాజ్యాల వాళ్లు పోటీ పడ్డారు. రవి రాజ్యం నుంచి విశ్వ, ఆనీ, శ్వేత లు రాగా సన్నీ రాజ్యం నుంచి మానస్, జెస్సీ, ప్రియాంక లు వచ్చారు.
మానస్, విశ్వ మధ్య గట్టి పోటీ జరిగింది. ఇక ఈ రౌండ్ లో విశ్వ గెలిచాడు. రవి టీం లో శ్వేత, ఆనీ మాస్టర్ లను పోటీకి దింపగా సన్నీ ఒప్పుకోలేదు. ఇక శ్వేతా కూడా రవి నిలదీసింది.
అలా వారి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. చివరికి ఆనీ మాస్టర్ కాంప్రమైజ్ అయ్యి పోటీకి సిద్ధం అయింది. జెస్సీతో పోటీలో పాల్గొన్నది.
కానీ చివరికి జెస్సీ చేతిలో ఓడిపోయింది. మొత్తానికి కుస్తీ పోటీలో రవి టీం సన్నీ టీం పై గెలవడంతో సన్నీ టీం ఆనందంతో తేలిపోయింది.
మరోవైపు షణ్ముఖ్, సిరి, ప్రియాంకలు గేమ్ లో భాగంగా కాయిన్స్ దొంగతనం చేయడంతో విశ్వ వారిపై ఫైర్ అయ్యాడు.
ఇక మధ్యలో మానస్ వచ్చి అందరినీ కలిపి అనకూడదు అనేసరికి వారి మధ్య కాస్త గొడవ పెద్దగా మారింది. సిరి, షణ్ముఖ్, జెస్సీ మాత్రం కాయిన్స్ కొట్టేసి మరి దుప్పట్లో దూరారు.
మరోవైపు శ్రీరామ్, హమీదా అందరూ నిద్రపోయాక రొమాన్స్ తో బాగా రెచ్చిపోయారు. తమ తమ బెడ్ లపై కూర్చొని ఎయిర్ కిస్ లతో రచ్చ మొదలుపెట్టారు.
ఇక రాజు గారి గోడ టాస్క్ లో బిగ్ బాస్ కేటాయించిన బోర్డుపై ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వమని తెలపగా అక్కడ కాస్త కొట్లాట జరిగింది.
పైగా శ్రీరామ్ చేతికి చిన్న దెబ్బ కూడా తగలడంతో హమీదా కాస్త రియాక్ట్ అయ్యింది. ఇక తాడుని లాగే టాస్క్ లో కూడా సన్నీ టీం గెలిచింది.