ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఆ కథని ఓకె చేసి ఉంటే.. శ్రీమంతుడు సహా మూడు చిత్రాలు ఉండేవే కాదు..
లక్ష్యం, లౌక్యం, రామరామ కృష్ణ కృష్ణ లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా శ్రీవాస్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం శ్రీవాస్ హీరో గోపీచంద్ తో రామబాణం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
లక్ష్యం, లౌక్యం, రామరామ కృష్ణ కృష్ణ లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా శ్రీవాస్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం శ్రీవాస్ హీరో గోపీచంద్ తో రామబాణం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మే 5న ఈ చిత్ర చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో శ్రీవాస్ ది ప్రత్యేకమైన శైలి.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gwrxhrsc9gnk12rwn8c3vvsp/rama-banam-jpg_300x375xt.jpg)
రీసెంట్ గా ఇంటర్వ్యూలో శ్రీవాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తాను ఓ చిత్రం చేయడానికి ప్రయత్నించాను అని తెలిపారు. ఆ ప్రాజెక్టు ఓకే ఐ ఉంటే టాలీవుడ్ లో మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉండేవే కాదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను తెరకెక్కించిన లక్ష్యం సూపర్ హిట్ అయిన తర్వాత నేను నిర్మాత దిల్ రాజుకి ఒక స్టోరీ లైన్ చెప్పాను. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేద్దాం అని దిల్ రాజు చెప్పారు. నేను బివిఎస్ రవి మూడు నెలల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేశాము. ఎన్టీఆర్ ని కలసి ఫైనల్ నేరేషన్ ఇచ్చాం. తారక్ కి కూడా ఈ కథ అద్భుతంగా నచ్చింది.
కానీ కొన్ని రోజుల తర్వాత ఇక చిత్రం ప్రారంభం అవుతుంది అనగా.. ఎన్టీఆర్ తనకు ఈ కథ సూట్ కాదని రిజెక్ట్ చేశారు. దీనితో నేను షాక్ అయ్యాను. ఆ చిత్రం కనుక ఎన్టీఆర్ చేసి ఉంటే శ్రీమంతుడు, మహర్షి, శతమానం భవతి చిత్రాలు వచ్చేవి కాదు అని అన్నారు. ఆ మూడు చిత్రాల కథ మేము ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథ ఒకటే అని శ్రీవాస్ తెలిపారు.
ఆ తర్వాత అదే కథని పవన్ కళ్యాణ్ కి కూడా నేరేట్ చేశాం అని.. కొన్ని కారణాల వల్ల ఆయన కూడా ఈ చిత్రాన్ని చేయలేకపోయారు. శ్రీమంతుడు రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు నాకు ఫోన్ చేశారు. మనం ఒక అద్భుతమైన చిత్రాన్ని మిస్ అయ్యాం అని తనతో చెప్పినట్లు శ్రీవాస్ అన్నారు.
రామబాణం చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మంచి ఆహారం, మంచి బంధాలు అనే బేసిక్ పాయింట్ తో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గోపీచంద్ ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకుని ఉన్నారు.