పోకిరి సినిమా సోనూసూద్ హీరోగా ప్లాన్ చేసిన పూరీ.. కానీ!
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాను సోనూసూద్తో పూరీ ప్లాన్ చేశాడన్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది. తెలుగు పోకిరి సినిమా ఘన విజయం సాధించటంతో అదే సినిమాను సోనూ హీరోగా హిందీలో రీమేక్ చేయాలని పూరీ భావించాడట.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మారుమోగిపోతోంది. కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలతో సంచలనంగా మారాడు. ఈ నేపథ్యంలో సోనూ సినిమా కెరీర్, పర్సనల్ విషయాలకు సంబంధించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
సినీ రంగం మీద ఇంట్రస్ట్తో ముంబై చేరిన సోనూకు అక్కడ అవకాశాలు రాకపోవటంతో సౌత్ మీద దృష్టిపెట్టాడు. దీంతో ఓ తమిళ సినిమాతో సోనూసూద్కు తొలి అవకాశం వచ్చింది. విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కిన కల్లా జగార్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు సోనూ.
ఇక తెలుగు విషయానికి వస్తే కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన హ్యాండ్సప్ సోనూ తొలి తెలుగు సినిమా. నాగబాబు, జయసుథ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్లో కనిపించాడు. తొలి సినిమాలో మెగాస్టార్తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు సోనూ.
అయితే ఆ తరువాత కొంత కాలనికి పూరి దృష్టి సోనూ మీద పడింది. అంతే ఏకంగా సూపర్ సినిమాలో సోనూకు హీరో క్యారెక్టర్ ఇచ్చాడు పూరీ. ఈ సినిమాలో నాగార్జునకు సమానమైన పాత్రలో కనిపించాడు సోనూ. అదే సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమా కూడా సోనూ టాలీవుడ్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది.
ఇక అరుందతి సినిమా సోనూ సూద్కు జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమాలో పశుపతి పాత్ర సోనూ తప్ప మరొకరు చేయలేరన్న స్థాయిలో చేసి మెప్పించాడు సోనూ సూద్. ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో నటించిన సోనూ జాకీచాన్తో కలిసి హాలీవుడ్ సినిమా కూడా చేశాడు.
అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాను సోనూసూద్తో పూరీ ప్లాన్ చేశాడన్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది. తెలుగు పోకిరి సినిమా ఘన విజయం సాధించటంతో అదే సినిమాను సోనూ హీరోగా హిందీలో రీమేక్ చేయాలని పూరీ భావించాడట. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తరువాత అదే సినిమాను వాటెండ్ పేరుతో రీమేక్ చేసిన సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు.