అవతలివైపు చిరు, బాలయ్య.. పవన్ ని వాడుకోవాలని చూస్తున్న దిల్ రాజు ?
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి పెద్ద బాక్సాఫీస్ యుద్ధమే జరగబోతోంది. ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నందమూరి బాలకృష్ణ తమ చిత్రాలతో రంగంలోకి దిగుతున్నారు.
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి పెద్ద బాక్సాఫీస్ యుద్ధమే జరగబోతోంది. ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నందమూరి బాలకృష్ణ తమ చిత్రాలతో రంగంలోకి దిగుతున్నారు. అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు అభిమానుల్లో ఇది చారిత్రాత్మక పోటీ అంటూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'వారసుడు' చిత్రాన్ని పెద్ద ఎత్తున సంక్రాంతికి రిలీజ్ చేయనుండడం వివాదంగా మారుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు చిత్రంలో నటిస్తున్నారు. దీనితో ఒక తమిళ చిత్రాన్ని.. తెలుగు చిత్రాలకి నష్టం చేకూర్చేలా భారీ స్థాయిలో రిలీజ్ చేయడం, థియేటర్స్ సమస్య సృష్టించడం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే తన ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారు అంటూ దిల్ రాజు తన వెర్షన్ వినిపిస్తున్నారు. అయితే చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైనప్పుడు థియేటర్స్ సరిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు తమిళ చిత్రంతో వచ్చి థియేటర్స్ కబ్జా చేయడం ఏంటి అనే వాదన వినిపిస్తోంది.
ఇంత పెద్ద వివాదం జరుగుతుండగా సడెన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. వారసుడు చిత్రం కోసం దిల్ రాజు పవన్ కళ్యాణ్ సాయం కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా భారీ ఎత్తున నిర్వహించేందుకు దిల్ రాజు సన్నాహకాలు చేస్తున్నట్లు టాక్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యేందుకు పవన్ ఒకే చెప్పారా లేదా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే పవన్ ప్రస్తుతం పొలిటికల్ గా, సినిమాల పరంగా బిజీగా ఉన్నారు.
వారసుడు వల్ల చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలు నష్టపోతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ దిల్ రాజుకి సాయం చేస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైతే నెగిటివ్ గా సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది.