రెహమాన్ మ్యూజిక్ షోలో పాట పాడిన దనుష్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్లో స్టార్ హీరో దనుష్ కూడా పాల్గొన్నరు. అంతే కాదు రాయన్ సినిమాలోని ఓ పాట పాడి అభిమానులను అలరించారు కూడా.

ఏ.ఆర్.రెహమాన్ 30 ఏళ్ళకు పైగా తన సంగీతంతో అభిమానులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో పాటలకు సంగీతం అందించారు. దేశవ్యాప్తంగా ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముంబైలో రెహమాన్ మ్యూజిక్ షో
ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో తాజాగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది. రెహమాన్ పాటలు వినేందుకు స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో రెహమాన్ మునుపటిలా పాడగలరా అని అంతా అనుమానపడిన వేళ.. ఈ కార్యక్రమంలో పూర్తి ఉత్సాహంతో రెహమాన్ పాడటం అభిమానులను ఉర్రూతలూగించింది.
రెహమాన్ షోలో దనుష్
ఈ మ్యూజిక్ షోలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు నటుడు దనుష్. అంతే కాదు రెహమాన్తో కలిసి పాట పాడారు. అదీ తమిళ పాట. తన 50వ సినిమా 'రాయన్' నుంచి 'అడంగాత అసురన్' పాట పాడారు. ఈ పాటకు మంచి స్పందన లభించింది.
దనుష్ పాడిన తమిళ పాట
దనుష్ పాడిన తమిళ పాట రెహమాన్ కచేరీలో హైలైట్గా నిలిచింది. దనుష్ నటిస్తున్న హిందీ సినిమా 'తేరే ఇష్క్ మే' కి కూడా రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'రాంఝనా'కు సీక్వెల్. ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ బ్రేక్ సమయంలో దనుష్ రెహమాన్ కచేరీలో పాల్గొన్నారు.