MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha manasu: కోపంతో రగిలిపోతున్న దేవయాని... పార్టీ చేసుకుంటున్న జగతి, మహేంద్ర!

Guppedantha manasu: కోపంతో రగిలిపోతున్న దేవయాని... పార్టీ చేసుకుంటున్న జగతి, మహేంద్ర!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Navya G
Published : Aug 17 2022, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... గౌతమ్ స్వీట్లు అడుగుతాడు ధరణి చేస్తాను అనేసరికి దేవయాని అక్కడికి వచ్చి సాక్షితో రిషి పెళ్లి ఆగిపోయినందుకు మీరందరూ సంబరపడిపోతున్నారా అని తిడుతుంది. అప్పుడు జగతి, గౌతమ్ స్వీట్లు అడిగాడు ధరణి చేస్తా అన్నది ఇందులో సంబరపడడానికి ఏముంది అని అడగగా గౌతమ్ అడిగితే ఈరోజు మనకి పెళ్లి ఆగిపోయింది కదా ఇలాంటి సమయంలో స్వీట్లు వద్దు అని చెప్పాలి కానీ మీరు కూడా వాడితో పాటు కలిసి నవ్వుకోవడమేంటి అని అంటుంది.అప్పుడు గౌతమ్ తెలివిగా పెద్దమ్మ, సాక్షి నిన్ను బెదిరించింది కదా నిన్ను కోర్టు వరకు తీసుకెళ్తాను అంది కదా.
 

27

అలాంటి సాక్షితో రిషి పెళ్లి ఆగిపోతే నువ్వు సంతోషంగా ఉండాలి కదా నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు. ఈ లోగ రిషి అక్కడికి వచ్చి మా పెద్దమ్మని ఏమంటున్నారు అని అంటాడు. సాక్షి విషయంలో జరిగిన దాని గురించి బాధపడుతున్నావా పెద్దమ్మ అని రిషి అడిగేసరికి గౌతం, లేదు చాలా ఆనందంగా ఉన్నారు పెద్దమ్మ. ఈ శుభ సందర్భంలో మాకు స్వీట్లు చేయమని కూడా చెప్పారు అని అంటాడు.అప్పుడు దేవయాని మనసులో నవ్వాలో ఎడాలో తెలియడం లేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో వసు ఆటోలో వెళుతూ వి అక్షరం ఉన్న ఉంగరాన్ని పట్టుకుని ఉంటుంది.
 

37

 అయినా ఉంగరంలో నా పేరులో మొదటి అక్షరం ఎందుకు రాయపించారు. ఈ విధంగా నేను అంటే ఇష్టమని చెబుదామనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉండగా రిషి ఫోన్ చేసి వెంటనే ఆటో దిగు అని అంటాడు. వసు ఆటో దిగుతుంది ఈ లోగా రిషి అక్కడికి వచ్చి తన కారులో ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత సీన్లో జగతి, మహీంద్రా, ధరణి ముగ్గురు కూర్చుని ఆఖరికి అంతా మంచే జరిగింది అని అనుకుంటారు.అప్పుడు మహేంద్ర నా జీవితంలో ఇంతకన్నా సంతోషమైన సంఘటన ఇంకేమీ లేదు అని ఎక్కువ మురిసిపోతూ ఉంటాడు. ఈలోగా జగతి మన ఎమోషన్స్ ని మన అదుపులో ఉంచుకోవాలి అని అంటుంది.
 

47

అప్పుడు మహేంద్ర,ఒక మనిషి అంటే దేవయాని వదిన లాగా ఉండాలి. చేసే పని మంచో చెడ్డో పక్కన పెడితే తను అనుకున్నది చేసే వరకు వదిలిపెట్టదు అని అంటుంది. ఈ లోగ జగతి ఇప్పుడు దేవయాని అక్కయ్య ఏం చేస్తూ ఉంటారు అని అనగా అదే సమయంలో దేవయాని తన గదిలో, సాక్షి మీద కోపం తో రగిలిపోతూ ఉంటుంది.ఇన్ని ఆశలు పెట్టుకుంటే ఆఖరికి అది అంతా పెంట పెంట చేసి వెళ్ళిపోయింది. అని గదిలో ఉన్న సామాన్లన్నీ కిందకి పగలగొడుతూ ఉంటుంది. ఆ శబ్దాలు విని జగతి ఒకసారి నువ్వు వెళ్లి చూడు ధరణి అని అంటుంది.
 

57

అప్పుడు ధరణి అక్కడికి వెళ్లే సరికి, నా ఏడుపును చూడడానికి వచ్చేవా అని అక్కడి నుంచి పంపించేస్తుంది దేవయాని. ఈలోగా ధరణి, జగతి దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు ఒంట్లో బాగా లేనట్టు ఉంది అని అంటుంది. అప్పుడు హాస్పిటల్ కి తీసుకువెళ్దామా? అని మహేంద్ర అంటాడు.అప్పుడు దేవయాని అక్కడికి వచ్చి నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించి గదిలో తాళం వేసి బంధిద్దాం అనుకుంటున్నారా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో రిషి కార్ ఆపి వసుధారతో మాట్లాడతాడు. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా?.
 

67

 నీ అనుమతి లేకుండా నీ పేరు వాడినందుకు నన్ను క్షమించు అని రిషి అనగా మీరు నాకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు సార్.ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు అని అంటుంది వసు.సాక్షి వెళ్ళిపోయినందుకు నాకు ఆశ్చర్యంగా ఏమీ లేదు అసలు ఎప్పుడు నాతో ఉందని. భూతద్దంలో చూస్తే ఎవరైనా దగ్గరగానే ఉంటారు అని అంటున్నాడు రిషి. జీవితంలో చాలా తక్కువ మందికి క్లారిటీ ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది ఏదేమైనా నేను గెలిచాను వసుధార అని రిషి అనగా నేను గెలిచాను సార్ అని వసు అంటుంది. రెస్టారెంట్ కె కదా వెళ్తున్నావ్ నేను దింపుతాను అని రిషి అంటాడు.
 

77

ఆ తర్వాత సీన్లో గౌతం, జగతి,మహేంద్ర రెస్టారెంట్లో కూర్చొని ఈ శుభ సందర్భాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటారు.కేక్ కట్ చేసి అందరికీ పంచుదామని అనుకుంటారు ఇంతకీ  స్పెషల్ ఏంటి అని అడిగితే ఏమని చెప్తావు అని జగతి అనగా ఒక మంచి పని జరిగింది అని చెబుదాము అని అంటాడు. అదే సమయంలో రిషి వసుతో పాటు అక్కడికి వస్తాడు. ఆశ్చర్యంతో గౌతమ్, మహీంద్రా, జగతిలు లేచి వీళ్లిద్దరూ ఎప్పుడు కలిశారు అని మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి, మనం ఆ విషయంతో పాటు ఈ విషయానికి కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఏమో అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved