Guppedantha Manasu: ఛీఛీ.. స్లమ్ వాళ్ళతో రొట్టెలు తిన్నారా.. జగతి, మహేంద్రను అవమానించిన దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 23 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu) మినిస్టర్ గారి వర్క్ ను పూర్తి చేస్తుంది. ఆ తరువాత వసు, జగతి కి కాల్ చేసి మేడం కంప్లీట్ అయింది ఒకసారి చెక్ చేసి చెప్తారా అని అడుగగా, అప్పుడు జగతి(jagathi) ఆ వర్క్ నేను కాదు మీ రిషి సార్ చూసి చెప్పాలి అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో జగతి దగ్గరికి మహేంద్ర, గౌతమ్ వస్తారు. అప్పుడు మహీంద్రా నీ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదా అని అనగా ఇప్పుడే వసుధార పూర్తి చేసి నాకు పంపించింది అని అంటుంది.
అప్పుడు గౌతమ్ వసుధార వర్క్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ వసు పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు. అప్పుడు మహేంద్ర (Mahendra)రిషి గురించి మాట్లాడుతూ రిషి(rishi)ని నువ్వే మామూలు మనుషిని చేయాలి అని గౌతమ్ కి చెబుతాడు. అప్పుడు రిషి ని తలచుకుని జగతి కూడా బాధపడుతుంది. ఆ తర్వాత రిషి కాఫీ తాగుతూ ఉండగా అప్పుడు వసు, మహేంద్ర దంపతులు ప్రాజెక్టు విషయం గురించి మాట్లాడుతూ ఉండగా వసుని చూసి రిషి డిస్టర్బ్ అవుతాడు.
ఆ తరువాత ధరణి(Dharani)వారికి జ్యూస్ తీసుకుని వెళుతూ ఉండగా దేవయాని వెటకారం గా మాట్లాడడంతో అప్పుడు ఫణీంద్ర దేవయానికి గట్టిగా బుద్ధి చెబుతాడు. అప్పుడు దేవయాని వసు ని ఇంటికి తీసుకొని వచ్చినందుకు కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తరువాత జగతి, రిషి(rishi)కి మినిస్టర్ ఇచ్చిన ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంటుంది.
అప్పుడు మహేంద్ర(mahendra)మధ్యలో కలుగజేసుకుని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తరువాత గౌతమ్, కాలేజీ స్టాఫ్ మేడం మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసు సైకిల్ మీద వస్తుంది. అప్పుడు వారు ముగ్గురూ కలసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి అందరికీ తెలియజేయడానికి కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడు రిషి, వసు(vasu) గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
అప్పుడు వసు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి కష్టపడితూ ఉండడం చూసి మురిసిపోతాడు. మరొకవైపు ఫణీంద్ర(phanindra), ధరణితో మాట్లాడుతూ ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చు కదా అని అనగా అప్పుడు దేవయాని(devayani)చేసే వంటపని ఇంటిపని బాగా చేస్తే చాలు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు ఫణీంద్ర, దేవయాని పై మండిపడతాడు.
ఇంతలో జగతి(jagathi) దంపతులు రావడంతో వారి గురించి వెటకారం గా మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు జగతి వాళ్ళు స్లం ఏరియా వాళ్ళతో రొట్టె చట్ని తిన్నాము అని అనగా దేవయాని (devayani)మనం ఏంటి మన స్థాయి ఏంటి అనే మాట్లాడుతుంది. అప్పుడు దేవయాని అరిచి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు గౌతమ్, కాలేజీ స్టాఫ్ మేడం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కార్ లో వెళ్తూ ఉంటారు.
అప్పుడు రిషి, వసు(vasu) గురించి గౌతమ్ ని అడగగా గౌతమ్ కొద్దిసేపు ఆట పట్టిస్తాడు. ఆ తరువాత వసు, రిషి (rishi)గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు జగతి దంపతులు దేవయాని అన్న మాటలు తలుచుకొని బాధ పడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో వసు, రిషి క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకొని కాస్త ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి రిషి నేను ఎప్పటికీ ఒకటే మాట మీద ఉంటాను అని అనడంతో వసు ఫీల్ అవుతుంది.