`సిగ్గు లేకుండా అవార్డ్ తీసుకుంది`.. `ఆర్ఆర్ఆర్` హీరోయిన్పై సెన్సేషనల్ కామెంట్స్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన మాటల దాడిని మరింతగా పెంచింది. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి పరిశ్రమలోని వారసత్వం, మాఫియా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. కొంత మంది పెద్దలను, వారసులను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంలో విరుచుకుపడుతుంది.
సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్లోని నెపోటిజం రాకెట్ను భారీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. అదే సమయంలో అవార్డ్ ఫంక్షన్స్కు సంబంధించిన స్కాం కూడా తెర మీదకు వచ్చింది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ అవార్డ్ ఫంక్షన్స్కు సంబంధించిన నామినేషన్స్ విషయంలో జరుగుతున్న మోసాలను బయట పెట్టింది.
ఈ సందర్భంగా కంగనా.. గతంలో హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు తనకు అవార్డ్ ఇచ్చినా.. తన పాత్ర ఆ స్థాయిలో లేదన్న ఉద్దేశంతో దీపిక ఆ అవార్డ్ను వద్దని చెప్పింది. కానీ అలియా మాత్రం గల్లీ బాయ్ సినిమాలో కేవలం 10 నిమిషాల పాత్రకు ఉత్తమ నటి అవార్డ్ను సిగ్గులేకుండా తీసుకుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అదే సమయంలో ఇండస్ట్రీలో ప్రచారం అవుతున్నట్టుగా మహేష్ భట్ తనకు మెంటర్ కాదని చెప్పింది. అనురాగ్ బసు తొలిసారిగా తన టాలెంట్ గుర్తించాడని క్లారిటీ ఇచ్చింది కంగనా.
నాకు డబ్బు, పేరు రెండూ కావాలి.. అందుకే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లతో కలిసి నటించాను. అయితే ఇలా నటించటం వల్ల నేను స్నేహితుల కంటే శత్రువులనే ఎక్కువగా తయారు చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కంగనా.
అదే సమయంలో సుశాంత్ పతనానికి బాలీవుడ్ పెద్దలే కారణం అన్న కంగనా, సుశాంత్కు ఆత్మాభిమానం ఎక్కువని, బాలీవుడ్ పెద్దలకు భజన చేయని కారణంగాను సుశాంత్ కెరీర్ను పాడు చేసి అతని ఆత్మహత్యకు కారకులయ్యారని ఆరోపించింది.
సంజయ్ లీలా భన్సాలీ రెండు సినిమాల్లో సుశాంత్ను తీసుకునేందుకు దాదాపు 5 ఏళ్ల పాటు ప్రయత్నించాడని, కానీ యష్ రాజ్ ఫిలిం సంస్థ అందుకు అంగీకరించలేదని ఆరోపించింది. ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు కూడా సిద్ధమని చెప్పింది కంగనా.