- Home
- Entertainment
- Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?
Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?
Dasari Narayana Rao: దర్శకరత్న దాసరి నారాయణ రావు ఒకప్పుడు తెలుగులో స్టార్ డైరెక్టర్గా వెలిగారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతేకాదు వేల కోట్లు సంపాదించారు. కానీ ఒక చిన్న మిస్టేక్ కారణంగా ఆయన మొత్తం పోగొట్టుకున్నారు.

జనం మెచ్చిన దర్శకుడు దాసరి
దర్శకరత్న దాసరి నారాయణరావు టాలీవుడ్ని శాసించిన దర్శకుడు. అద్భుతమైన సినిమాలతోనే కాదు, తన ఆదిపత్యంతోనూ ఇండస్ట్రీని రూల్ చేశాడు. పేదవాడైనా, పెద్ద వాడైనా, ఏ సమస్య ఉన్న దాసరి పరిష్కరించేవారు. అదే సమయంలో మంచి సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేసి మెప్పించారు. జనం మెచ్చిన దర్శకుడిగా నిలిచారు. సామాజిక సమస్యలు, లింగ వివక్ష, కుల వివక్ష, రాజకీయ అవినీతి వంటి అంశాలపై ఎక్కువగా సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. ప్రజల్లో తన సినిమాలతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి నారాయణరావు
ఇక ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలు, దర్శకుల గొడవలు, నిర్మాతల మధ్య ఇష్యూస్, థియేటర్ సమస్యలు, స్టార్స్ గొడవలు, వారి ఫ్యామిలీ గొడవలు ఇలా ఏదైనా తన వద్ద పరిష్కారం జరిగేవి. అందుకే ఆయన్ని అంతా పెద్ద దిక్కుగా భావించారు. ఆయన మరణం తర్వాత ఆ పెద్ద దిక్కు మిస్ అయ్యింది. ఆయన లోటు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో దాసరికి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన వేల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నారట. కొందరు మోసం చేశారట. దానికి కారణం దాసరి చేసిన మిస్టేకే అంటున్నారు. అదెలా అనేది చూస్తే..
దర్శకుడిగా బాగా సంపాదించిన దాసరి
దాసరి నారాయణరావు దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఓ దశలో ఆయన పీక్ లెవల్ని చూశారు. తిరుగులేని దర్శకుడిగా రాణించారు. ఒకే రోజు మూడు సినిమాల షూటింగ్ల్లో పాల్గొన్నారు. ఉదయం ఓ మూవీ తీస్తే, మధ్యాహ్నం మరో మూవీ, రాత్రి ఇంకో సినిమా షూటింగ్ చేసేవారు. అవన్నీ హిట్ అయ్యేవి. హీరోలు కాదు, దర్శకులు కూడా ఇలా మూడు సినిమాలు చేయోచ్చని నిరూపించిన దర్శకుడు దాసరి. ఇలా ఆయన నుంచి ఏడాది దాదాపు ఐదు నుంచి పది సినిమాల వరకు వచ్చేది. దీంతో పారితోషికం రూపంలో బాగా సంపాదించారు. దీనికితోడు చాలా సినిమాలు సొంత బ్యానర్లో ఉండేవి. అవన్నీ ఆయన సొంతమే. దీనికితోడు ఆయన నటుడు కూడా. చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. పత్రికని నడిపించారు. కొన్ని వ్యాపారాలు కూడా పెట్టారు.
దాసరి చేసిన మిస్టేక్
కానీ దాసరి సంపాదించిన డబ్బు నిలవలేదు. అంతా తన చుట్టూ ఉన్నవాళ్లు కాజేశారు. దాసరి తన చుట్టూ ఉన్న వాళ్లనే బాగా నమ్మాడట. వాళ్లే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు. కొందరు అధిక వడ్డీ వసూలు చేసి మోసం చేశారట. ఇంకోవైపు తన అకౌంట్స్ చూసుకోవడానికి ఇంట్లో వాళ్లు లేదు. ఇతరులను నమ్మడం వల్ల తప్పుడు లెక్కలు చూపించి అప్పులు చూపించారట. దీనికి కారణం దాసరినే. తనకు ఇద్దరు కొడుకులున్నారు. ఆయన ఏ రోజూ వాళ్లని పట్టించుకోలేదు. తన బిజీలో తాను ఉన్నాడు, దీంతో వాళ్లు జల్సాలకు పరిమితమయ్యారు. పెద్ద కొడుకు అమ్మాయితో లేచిపోయాడు, చిన్న కోడుకు జల్సా రాయుడిగా మారిపోయాడు. దీంతో ఇంట్లో బాధ్యతలు తీసుకునేవారే లేదు. అలా తాను సంపాదించినది మొత్తం ఇతరుల సొంతమైందని దర్శకుడు నందం హరిశ్చంద్రరావు వెల్లడించారు.
మోసం చేసింది వీళ్లే
దాసరికి వచ్చిన ఆదాయాన్ని చూసుకునే ఇంటిమనుషులు లేరని, దానివల్లే ఆయన ఆస్తులన్నీ దొంగలపాలయ్యాయని తెలిపారు. దాసరి తన భార్య పద్మకి ఆర్థికపరమైన అధికారం ఇవ్వలేదని, తన వద్దకు వచ్చిన వాటితోనే ఆమె ఆస్తులు కొనిపెట్టిందని తెలిపారు. అయితే దాసరి కొడుకులు మనీని మ్యానేజ్ చేసే స్థితిలో లేరు. పెద్ద కొడుకు అమ్మాయితో వెళ్లిపోయాడు, చిన్న కొడుకు జల్సాలకే పరిమితమయ్యాడు, బాధ్యతలు తీసుకోలేదు. దాసరి కూడా కొడుకులను పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. దాసరి తనకు వచ్చే సంపాదనని చూసుకునే బాధ్యతని తనకు నమ్మకమైన వారికి అప్పగించారు. వారిలో చాలా మంది మోసం చేశారు. ఎక్కువ బిల్లలు వేయడం, వడ్డీలు ఎక్కువ కట్టడం చేశారు. ఇక తన వద్ద ఫైనాన్స్ తీసుకున్నవాళ్లు ఎగొట్టడం, తాను ఫైనాన్స్ తీసుకుంటే ఎక్కువ వడ్డీలు కట్టడం ఇలా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయని, తన చుట్టూ ఉన్నవాళ్లే, తనకు నమ్మకమైన వాళ్లే, రోజూ గురువుగారు గురువుగారు అంటూ తిరిగివాళ్లే ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేశారని, దాసరి సంపాదించిన దాంట్లో ఇప్పుడు మిగిలిన ఆస్తులు సగం కూడా ఉండవని తెలిపారు. ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. అలా ఇప్పుడు విలువతో పోల్చితే వేల కోట్లు దాసరిగారు కోల్పోయారని చెప్పొచ్చు.

