'బిగ్ బాస్ 4 ': అందరూ హోమ్ క్వారంటైన్ లోనే...!
కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోయి,టీవి పరిశ్రమ సైతం తీవ్ర నష్టాలు చవిచూస్తోంది. స్టార్ మా పరిస్దితి అదే. టీవి సీరియల్స్ లేక, మిగతా షో లు లేక పాత వాటినే ప్రసారం చేస్తూ కాలక్షేపం చేసి, ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్ లో పడుతోంది. దాంతో ఆ నష్టాలను పూడ్చుకోవటానికి తన ప్రతిష్టాత్మకమైన షో ..బిగ్ బాస్ పైనే ఆశలు పెట్టుకుంది. మిగతా ఛానెల్స్ సరైన పోగ్రామ్ లు లేని ఈ సమయంలో ఈసారి బిగ్ బాస్ కి మాములుగా కంటే ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుందని ఛానెల్ యాజమాన్యం ఆశిస్తోంద. అందుకే ఎంత ఖర్చు అయినా...ఈ షోను హై సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెలాఖరు నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్లో ఎవరు పాల్గొంటారనేది ఖరారైపోయినా... కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం బయిటకు రానివ్వలేదు స్టార్ మా నెట్వర్క్. ఈ షోపై స్టార్ మాటీవి చాలా ఆశలు పెట్టుకుంది.
అయితే బయిట కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ...అన్ని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే రంగంలోకి దూకుతోంది. అందులో భాగంగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ తో పాటు ఈ షోకి పని చేసే క్రూ అందరినీ పద్నాలుగు రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు.
కరోనా పాజిటివ్ ఉన్నా, లేకున్నా ఇదైతే కంపల్సరీ అని తెలుస్తోంది. అలా ఒప్పుకుని ఎగ్రిమెంట్ చేసిన వాళ్లని మాత్రమే ఈ షోలోకి తీసుకుంది.
ఇక హోమ్ క్వారంటైన్ 14 రోజుల పాటు సాగనుంది. ఈ సమయంలో వాళ్లెవకీ వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరికీ దూరంగా ఉండాల్సిందే.
క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యా... మరోసారి కరోనా టెస్ట్ చేసి అటునుంచి అటే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు. దాంతో కరోనా కు ఈ టీమ్ ని జాగ్రత్తగా ఉంచగలుగుతాను అని సంస్ద భావిస్తోంది.
ఇక మూడు సీజన్స్ ని విజయవంతంగా గా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ త్వరలో నాలుగో సీజన్ మొదలు కాబోతుంది. ఈ మేరకు నాలుగో సీజన్ గురించి స్టార్ మా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.. అంతేకాకుండా బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది.
ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మొదట తరుణ్, శ్రద్ధాదాస్, ఝాన్సీ, రష్మీ గౌతమ్, వర్షిణి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తరుణ్, శ్రద్ద ఖండించారు. ఇప్పుడు హైపర్ ఆది, స్టార్ సింగర్స్ సునీత, మంగ్లీ, హీరో నందు, తాగుబోతు రమేష్, వైవా హర్ష, అఖిల్ సార్ధక్ పేర్లూ వినిపిస్తున్నాయి.
వీళ్లు మాత్రమే కాక.. మరికొంతమంది మాజీ హీరోయిన్ల పేర్లూ పరిశీలిస్తున్నారు అని వినికిడి. అంతేకాదు బిత్తిరి సత్తి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.అయితే బిత్తిరి సత్తి సైతం సాక్షి ఛానెల్ లో చేరారు. మరి వీళ్లలో ఎవరు ఫైనల్ అన్నది ఇంకొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.
ఇక కరోనా బయిట ఓ ఊపు ఊపటంతో.... ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
డాక్టర్లు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులని చెక్ చేస్తారట! ఇష్యూస్ ఏమీ లేకపోతే వారితోనే షోని కంటిన్యూ చేస్తారట నిర్వాహకులు.! అదీ విషయం.
ఇక ఈ షోలో కనిపించబోయే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తయిందని తెలుస్తోంది. అతిత్వరలో షూట్ స్టార్ట్ చేసి ఆగస్టు 30 నుంచి ప్రసారం చేసేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారట. కాగా గత సీజన్లా 100 రోజులు కాకుండా ఈ సారి కేవలం 75 రోజుల్లోనే ఈ షో ఫినిష్ చేయబోతున్నారని టాక్.