- Home
- Entertainment
- డైరెక్టర్ చెప్పిందల్లా చేశా.. 'ఆచార్య' మూవీ విషయంలో బాధపడింది అందుకే, చిరంజీవి కామెంట్స్
డైరెక్టర్ చెప్పిందల్లా చేశా.. 'ఆచార్య' మూవీ విషయంలో బాధపడింది అందుకే, చిరంజీవి కామెంట్స్
ఆచార్య, భోళా శంకర్ చిత్రాల పరాజయాలు మెగా ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తొలిసారి నటించిన ఆచార్య మూవీ అంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం కూడా ప్రారంభమైంది. ఇటీవల చిరంజీవికి వాల్తేరు వీరయ్య తప్ప సరైన సక్సెస్ లేదు. దీంతో ఈ రెండు చిత్రాలపై మెగా ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
megastar chiranjeevi
ఆచార్య, భోళా శంకర్ చిత్రాల పరాజయాలు మెగా ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తొలిసారి నటించిన ఆచార్య మూవీ అంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. పైగా ఈ చిత్రంలో రాంచరణ్ కూడా నటించారు.
Chiranjeevi
ఆచార్య ఫ్లాప్ పై చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లాప్ మూవీస్ ని ఎలా తీసుకుంటారు? ఆచార్య లాంటి మూవీ నిరాశపరిచినప్పుడు ఎలా ఫీలయ్యారు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ.. నా కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసే వాడిని. ఫెయిల్యూర్ వస్తే కుంగిపోయేవాడిని. ఇది కెరీర్ బిగినింగ్ లో మాత్రమే. ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చాక హిట్స్, ఫ్లాపులని పట్టించుకోవడం మానేశాను.
ఆ తర్వాత వచ్చిన ఫ్లాప్ చిత్రాలు నాపై ప్రభావం చూపలేదు. ఫ్లాప్ చిత్రాలని తట్టుకునే శక్తి నాకు ఇప్పుడు ఉంది. ఆచార్య విషయానికి వస్తే.. ఆ చిత్రం కూడా నన్ను ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. అది దర్శకుడు ఛాయిస్.. దర్శకుడు చెప్పిందల్లా మేము చేసాం. కానీ ఆచార్య చిత్రంలో చిన్న నిరాశ ఏంటంటే.. నేను చరణ్ కలిసి నటించిన తొలి చిత్రం ఈ విధంగా ఫ్లాప్ కావడం కాస్త బాధ కలిగించింది. దాని నుంచి త్వరగానే బయటికి వచ్చేసాం అని చిరంజీవి అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం ఫాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఇక అనిల్ రావిపూడి చిత్రం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొంది. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా ఒక నిర్మాత. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.