బాలయ్య డైరెక్టర్ ని గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేసిన చిరు.. ఆ మాట చెప్పడం కొసమెరుపు
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. బాలయ్య, చిరు చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరిది పైచేయి అవుతుంది ? కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ ఉండేది.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. బాలయ్య, చిరు చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరిది పైచేయి అవుతుంది ? కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ ఉండేది. కానీ రెండు చిత్రాలు అద్భుత విజయం సాధించి ఇంకా వసూళ్లు రాబడుతున్నాయి.
బాలయ్యని వీరసింహారెడ్డిగా ప్రజెంట్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో గోపీచంద్ అనేక విషయాల గురించి ఓపెన్ అయినట్లు ఉన్నారు.
వీరసింహారెడ్డి చిత్రం విషయంలో తొలి రోజు నుంచే కాన్ఫిడెంట్ ఉన్నానని అన్నారు. అందుకే సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలైన రెండు పెద్ద హిట్స్ అవుతాయని తెలుసు. సినిమా పిచ్చితోనే తాను ఇండస్ట్రీకి వచ్చానని గోపీచంద్ అన్నారు. అందుకే ఇంటర్ కూడా పూర్తి కాలేదు అని నవ్వుతూ తెలిపారు.
ఇక వీరసింహారెడ్డి చిత్రంలో పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్న డైలాగ్స్ గురించి గోపీచంద్ ఓపెన్ అయ్యారు. ఆ డైలాగులు ఇంటెన్షనల్ గా పెట్టలేదని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో జరిగిన అరుదైన సంఘటనని గోపీచంద్ రివీల్ చేశారు.
నా పుట్టినరోజు సెలెబ్రేషన్స్ షూటింగ్ లొకేషన్ లో జరుగుతున్నాయి. అక్కడికి అల్లు అరవింద్ గారితో చిరంజీవి గారు కూడా వచ్చారు. బర్త్ డే గిఫ్ట్ గా నాకు చిరంజీవి వాచ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి నీ టైం మారుతుంది చూడు అని చెప్పారని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు.
క్రాక్ చిత్ర రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన వివాదం గురించి గోపీచంద్ ప్రస్తావించారు. తనకు ఇంతవరకు ఏ చిత్రానికి పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు అని అన్నారు. నేను మొట్ట మొదటిసారి పూర్తి రెమ్యునరేషన్ తీసుకున్న చిత్రం 'వీరసింహా రెడ్డి' అని గోపీచంద్ మలినేని అన్నారు.