ట్రెండీ కోటులో సూపర్ హాట్ గా... కసి కళ్ళతో చంపేస్తూ రెచ్చగొడుతున్న కియారా అద్వానీ
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు కియారా అద్వానీ. దీనితో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలం అయ్యింది. 2019లో విడుదలైన వినయ విధేయ రామ చిత్రం తరువాత కియారా తెలుగులో మూవీ చేయలేదు.
మహేష్ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా ఎంట్రీతోనే సూపర్ హిట్ కొట్టింది. అయితే రామ్ చరణ్ కి జంటగా చేసిన వినయ విధేయ రామ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
మరలా రామ్ చరణ్ తో జోడి కట్టడానికి కియారా సిద్ధం అయ్యారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం కియారాను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
మరోవైపు ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రం కోసం కూడా కియారాను సంప్రదించారట. అయితే రామ్ చరణ్ మూవీ కోసం ఎన్టీఆర్ మూవీ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
ప్రస్తుతం హిందీలో నాలుగు చిత్రాలు చేస్తున్నారు ఆమె. కార్తీక్ ఆర్యన్ కి జంటగా భూల్ బులయ్యా 2 చిత్రంలో నటిస్తున్న కియారా... సిద్దార్థ్ మల్హోత్రా షేర్షా మూవీలో నటిస్తున్నారు.
అలాగే జగ్ జగ్ జియో, మిస్టర్ లీలీ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తంగా అటు సౌత్ ని ఇటు నార్త్ ని కవర్ చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారారు.
ఇక సిద్దార్థ్ మల్హోత్రాతో చాలా కాలంగా కియారా ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు మార్లు పబ్లిక్ ప్రదేశాల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు ఈ జంట.
మన టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు కూడా కియారా మంచి ఫ్రెండ్. వీరిద్దరు అప్పుడప్పుడు కలవడమే కాకుండా వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.