- Home
- Entertainment
- డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్
టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారం పెద్ద సమస్యగా మారుతోంది. పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం ఆ తర్వాత కొందరు నిర్మాతలు రియాక్ట్ అవుతుండడంతో ఇండస్ట్రీలో పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
థియేటర్ల బంద్ వివాదం
టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వివాదం ముదురుతోంది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల స్ట్రైక్ చేయబోతున్నట్లు ఇప్పటికే ఎగ్జిబిటర్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు చొరవ తీసుకొని ఎగ్జిబిటర్ల సమస్యలు పరిష్కరించేందుకు పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
ఫిలిం ఛాంబర్ క్లారిటీ
అయితే థియేటర్ల బంద్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అని, జూన్ 1న థియేటర్ల బంద్ ఉండడం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు శనివారం రోజు ఈ ప్రకటన చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని, అవసరమైతే ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపారు. కానీ థియేటర్ల బంద్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలు మొత్తం ఊహాగానాలేనని ఫిలిం ఛాంబర్ పేర్కొంది.
హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు ఇలా..
జూన్ 12న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది. సరిగ్గా పవన్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో థియేటర్ల బంద్ వ్యవహారం తెరపైకి రావడంతో ఫ్యాన్స్ దీనిని కుట్రగా భావిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ సన్నిహితులు కూడా దీని వెనుక కుట్ర దాగి ఉందని అంటున్నారు. అనవసరంగా థియేటర్ల సమస్య సృష్టించి పవన్ చిత్రాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు అంటూ ట్రోలింగ్ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ సీరియస్
ఈ వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో మరిచిపోయారా అంటూ పవన్ ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు చొరవ చూపిస్తుంటే ఇలాంటి అనవసర సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేస్తున్నాం
పవన్ కళ్యాణ్ ప్రకటనపై టాలీవుడ్ నిర్మాతలు స్పందిస్తున్నారు. తాజాగా బన్నీ వాసు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 'సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది' అని బన్నీ వాసు ట్వీట్ చేశారు.
అనవసర సమస్య పెద్దదిగా మారింది
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత నాగ వంశీ కూడా స్పందించారు. కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారు. ఇప్పుడు అవే పెద్ద సమస్యలుగా మారాయి. కామన్ సెన్స్ తో ఆలోచించి ఉంటే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు అని నాగ వంశీ ట్వీట్ చేశారు.