స్టార్ హీరో సినిమా భారీ ఫ్లాప్.. కోలుకోలేని దెబ్బ, ఆర్ఆర్ఆర్ పై నిర్మాత కామెంట్స్
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా నటించిన చిత్రం మైదాన్. జాన్వీ కపూర్ తండ్రి అగ్ర నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియమణి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా నటించిన చిత్రం మైదాన్. జాన్వీ కపూర్ తండ్రి అగ్ర నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియమణి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం రిలీజైనపుడు టాక్, రివ్యూలు చాలా పాజిటివ్ గా వచ్చాయి.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hvjty1yypzefgvberm1chbeh/whatsapp-image-2024-04-16-at-11-53-17-am--1-_300x375xt.jpg)
కానీ సినిమా ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా మారింది. కనీసం ఈ చిత్రం 50 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. లెజెండ్రీ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
డైరెక్టర్ అమిత్ శర్మ ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. మంచి టాక్ రావడంతో ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అంతా భావించారు.కానీ ఆడియన్స్ ఈ చిత్రం చూడడానికి థియేటర్స్ కి వెళ్ళలేదు. భారీ ప్రమోషన్స్ చేసినా ప్రేక్షకులకు ఆసక్తి కలగలేదు.
ఇది నిర్మాత బోనీ కపూర్ కి ఊహించని షాక్ లాగా మారింది. ఈ నష్టాల నుంచి బోనీ కపూర్ కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నారు. అయితే మైదాన్ పరాజయం పై బోనీ కపూర్ తాజాగా స్పందించారు. మైదాన్ చిత్ర కథ అద్భుతం.
కానీ ఆడియన్స్ ఇలాంటి చిత్రాలని థియేటర్స్ లో చూడడానికి ఇష్టపడడం లేదు. ఆర్ఆర్ఆర్, పఠాన్ లాంటి భారీ యాక్షన్ చిత్రాలని చూడడానికి మాత్రమే థియేటర్స్ కి వెళుతున్నారు అని బోనీ కపూర్ అన్నారు.
షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాల తర్వాత బాలీవుడ్ మళ్ళీ తిరోగమనంలో ఉంది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలకు అంతగా ఆదరణ లభించలేదు. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు కల్కి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర లాంటి టాలీవుడ్ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.