Jamuna Rani Death: ఎస్. జానకి తర్వాత మరో విషాదం.. ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత!
Jamuna Rani Death: ప్రముఖ పాతతరం గాయని జమునారాణి బెంగళూరులో కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. జమునారాణి మరణం సంగీత ప్రియులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

జమునారాణి కన్నుమూత
తన గాత్రంతో సంగీత ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన గాయని జమునారాణి. 88 ఏళ్ల ఈ సీనియర్ గాయని, వయసు రీత్యా వచ్చిన సమస్యలతో బాధపడుతున్నారు. కాగా బెంగళూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్త దక్షిణాది సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం కల్లహళ్లిలో జరగనున్నాయి. జమునారాణి 1938లో ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. తన ఏడవ ఏటనే ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు.
త్యాగయ్య సినిమాతో ఎంట్రీ
జమునారాణి పాడిన తెలుగు పాటలు
తెలుగు చిత్రసీమలో తన విశిష్టమైన గొంతుతో ‘సరదా సరదా సిగరెట్టు’, ‘ఎంత టక్కరి వాడు నారాజు’, ‘ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం’, ‘కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా’, ‘పదపదవె వయ్యారి గాలిపటమా’ వంటి హుషారైన పాటలు పాడి శ్రోతల్లో అపారమైన ఖ్యాతిని సంపాదించుకున్నారు ప్రముఖ గాయని కె. జమునారాణి. ఆమె గాత్ర పటిమ కేవలం భారతీయ భాషలకే పరిమితం కాకుండా, శ్రీలంకకు చెందిన సింహళ చిత్రాల్లో ఆమె ఆలపించిన గీతాలు అక్కడ ప్రభంజనం సృష్టించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘సద సులాంగ్’ అనే సింహళ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఏ.ఎమ్. రాజా గారితో కలిసి ఆమె పాడిన ‘జీవన మీ గమన రంసారే’ అనే యుగళగీతం శ్రీలంక సంగీత చరిత్రలోనే ఒక ఆల్-టైమ్ క్లాసిక్గా నిలిచిపోయి, నేటికీ అక్కడ అత్యంత ఆదరణ పొందుతోంది.

