- Home
- Entertainment
- Saif Ali Khan: దాడి జరిగిన రోజు ఆటోలో సైఫ్తో ఎవరెవరు ఉన్నారో తెలుసా.? తొలిసారి స్పందించిన హీరో
Saif Ali Khan: దాడి జరిగిన రోజు ఆటోలో సైఫ్తో ఎవరెవరు ఉన్నారో తెలుసా.? తొలిసారి స్పందించిన హీరో
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి దేశ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అత్యంత భద్రత నడుమ ఉండే సైఫ్ అలీఖాన్ లాంటి సెలబ్రిటీపై దాడి జరగడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న సైఫ్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
- FB
- TW
- Linkdin
Follow Us
)
saif alikhan
సైఫ్ అలీఖాన్పై జనవరి 16వ తేదీన దాడి జరిగిన విషయం తెలిసిందే. బ్రాందాలోని తన నివాసంలో ఉ్న సైఫ్ అలీఖాన్పై అర్థరాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్యారేజీలో ఉన్న కారు కోసం సమయాన్ని వృధా చేయకుండా సైఫ్ను ఆటోలో ఒక సామాన్య వ్యక్తిలా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా షార్ట్కర్ట్ రూట్స్లో సైఫ్ను లీలావతి హాస్పిటల్కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో సైఫ్ ప్రాణాల నుంచి బయటపడ్డారు.
saif alikhan
సుమారు 5 రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం సైఫ్ జనవరి 21వ తేదీన లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన నివాసంలో సైఫ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సైఫ్అలీఖాన్ తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దాడి జరిగిన రోజును గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు తైమూర్ మాటలు గుర్తు చేసుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. కత్తితో పొడిచినట్లు మొదట తనకు తెలియలేదని చిన్న గాయం అయిందనుకున్నట్లు సైఫ్ అన్నారు. తర్వాత వీపు భాగంలో నొప్పి రావడంతో కత్తితో దాడి చేసినట్లు తెలిసిందన్నారు.
దాడి జరిగిన వెంటనే తన వీపులో విపరీతమైన నొప్పి కలిగిందన్న సైఫ్.. అప్పుడు గమనిస్తే కత్తితో దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా చూసిన కరీనా ఒక్కసారిగా కంగారు పడి అందరికీ ఫోన్లు చేస్తుందని, అయితే ఒక్కరూ కూడా ఫోన్ తీయలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఒకరినొకరు చూసుకుని తాను బాగానే ఉన్నానని, ఏం కాదని కరీనానాకు ధైర్యం చెప్పారంటా. అయితే అదే సమయంలో ఆయన కుమారుడు తైమూరు సైఫ్ వద్దకు వచ్చి ‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ అని అడిగాడంటా.. దీనికి బదులిస్తూ అలా ఏం జరగదని సైఫ్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే సైఫ్ను ఇబ్రహీం ఆసుపత్రిలో చేర్చిన సమయంలో తూమూర్ కూడా వచ్చాడు. ఈ విషయమై సైఫ్ మాట్లాడుతూ.. 'దాడి జరిగిన తర్వాత కొంతసేపటికి నా కుమారుడు చాలా కూల్గా ఆలోచించాడు. ‘నేనూ మీతో వస్తాను’ అని ఆసుపత్రికి వచ్చాడు. నేను కూడా ఒంటరిగా వెళ్లాలనుకోలేదు. అందుకే నాతోపాటు తైమూర్ను తీసుకెళ్లాను. ఒకవేళ నాకు ఏమైనా జరిగినా ఆ సమయంలో నా కుమారుడు నా పక్కనే ఉండాలని కోరుకున్నాను' అని సైఫ్ తెలిపారు. ముగ్గురూ ఆటోలోనే ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.
కేసులో పురోగతి..
కాగా ప్రస్తుతం సైఫ్ దాడి కేసుకు సంబంధించి పురోగతి కనిపిస్తోంది. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఇటీవల ఐడెంటిఫికేషన్ పెరేడ్ చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన సైఫ్ ఇంటి సహాయకులకు చూపించారు. ఆర్థర్ జైలులో అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఐడెంటిఫికేషన్ పెరేడ్లో నిందితుడిని వారు గుర్తించారు. సైఫ్పై దాడి చేసింది అతడేనని తెలిపారు.