పూనకాలు, కన్నీళ్లు గ్యారెంటీ.. ప్రభాస్ కోసం సెన్సేషనల్ స్టోరీ రెడీ చేసిన 'బింబిసార' రచయిత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు, కమిటైన మూవీస్ కంప్లీట్ కావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు, కమిటైన మూవీస్ కంప్లీట్ కావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది. కానీ ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకునే దర్శకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి బింబిసార చిత్రానికి డైలాగులు రాసిన యువ రచయిత వాసుదేవ్ కూడా చేరారు.
ప్రభాస్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అని తెలిపారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా చేయాల్సి ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో వాసుదేవ్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో సినిమా చేయాలనేది తన కోరిక అని అన్నారు.
ప్రభాస్ కోసం ఆల్రెడీ కథ కూడా రెడీ చేసినట్లు తెలిపారు. తనకి స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆదర్శం అని తెలిపారు. ఎప్పటికైనా భగత్ సింగ్ కథని నా సినిమాలో చెప్పాలని అనుకుంటున్నా. ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకుని కథ కూడా రెడీ చేశా. భగత్ సింగ్ చనిపోయిన నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. భగత్ సింగ్ పాత్రకి ప్రభాస్ బాగా సరిపోతారు అని వాసుదేవ్ అన్నారు.
ఈ యువ రచయిత చెబుతోంది చూస్తుంటే.. ప్రభాస్ అభిమానులకు ఒకేసారి పూనకాలు, కన్నీళ్లు గ్యారెంటీ అని అర్థం అవుతోంది. భగత్ సింగ్ పేరు చెబితేనే గూస్ బంప్స్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇక ఆయన మరణం ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది.
తాను ఇండస్ట్రీకి దర్శకుడు కావాలని వచ్చినట్లు వాసుదేవ్ తెలిపారు. కానీ ఏం చేసినా బింబిసార 2 తర్వాతే ఉంటుందని వాసుదేవ్ అన్నారు. త్వరలో బింబిసార 2 స్టోరీ చర్చలు మొదలు కానున్నట్లు తెలిపారు. కళ్యాణ్ రామ్ గారి పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఆయన దృష్టిలో పడ్డాను.
నా ప్రతిభని గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు అని వాసుదేవ్ అన్నారు. బింబిసార 2 తర్వాత తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటాను అని వాసుదేవ్ తెలిపారు. మరి ఈ యువ రచయితకి ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.