Bigg Boss Telugu 7: టైటిల్ ఫేవరేట్స్ శివాజీ, ప్రశాంత్ లకు ఊహించని దెబ్బ, ఆ ఇద్దరు ఎలిమినేట్!
12వ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి ఫలితాలు అనూహ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్ ఫేవరేట్స్ కి షాక్ తగిలిందని అంటున్నారు.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అవిక్షన్ పాస్ గెలిచిన యావర్ దాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ కారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడు. వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అన్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hfnsd7ww7de2vgzp3yay4d9z/whatsapp-image-2023-11-20-at-12-19-19--1--jpeg_300x151xt.jpg)
Bigg Boss Telugu 7
ఇక 12వ వారానికి మంగళవారం నామినేషన్స్ ముగిశాయి. కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాదనలు నడిచాయి. ఇక శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, అశ్విని, రతిక, గౌతమ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మంగళవారం రాత్రి 10:30 నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు.
Bigg Boss Telugu 7
ప్రాథమిక ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. శివాజీ, పల్లవి ప్రశాంత్ లను వెనక్కి నెట్టి అమర్ దీప్ టాప్ లోకి వచ్చాడట. శివాజీ, పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫెవరేట్స్ గా ఉన్నారు. వారు ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినా టాప్ లో కొనసాగుతున్నారు. ఈసారి మాత్రం వారు 2, 3 స్థానాలకు పడిపోయారని సమాచారం.
అమర్ దీప్ 1వ స్థానంలో ఉండగా శివాజీ 2వ స్థానంలో ఉన్నాడట. శివాజీ అనంతరం 3వ స్థానంలో పల్లవి ప్రశాంత్ కొనసాగుతున్నాడట. ఇక 4వ స్థానంలో యావర్, 5వ స్థానంలో గౌతమ్, 6వ స్థానంలో అర్జున్ ఉన్నాడని సమాచారం. చివరి రెండు స్థానాల్లో రతిక, అశ్విని ఉన్నారట.
Bigg Boss Telugu 7
ప్రస్తుత ఓటింగ్ సరళి ప్రకారం రతిక రోజ్, అశ్విని ఇంటిని వీడనున్నారు. డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో చివర్లో ఉన్న వీరు ఎలిమినేట్ అవుతారు. అయితే ఓటింగ్ మొదలై ఒక్కరోజే అవుతుంది. కాబట్టి ఫలితాలు మారవచ్చు. రతిక, అశ్వినిలలో ఒకరు ఎలిమినేట్ కావడం మాత్రం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. కారణం ఉన్న వాళ్లలో వీరిద్దరే వీక్ కంటెస్టెంట్స్.
Bigg Boss Telugu 7
కాగా పల్లవి ప్రశాంత్ టాస్క్ లలో మరోసారి తన పవర్ చూపించాడు. మిగతా 9 మంది కంటెస్టెంట్స్ మీద గెలిచి అవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. ఈ పాస్ తో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్న ఒకరిని సేవ్ చేయవచ్చు. పల్లవి ప్రశాంత్ తనకు వాడుకుంటాడా లేక ఇంకెవరికైనా వాడతాడా? అనేది సస్పెన్సు...
ప్రశాంత్ దే ఎవిక్షన్ పాస్.. హౌజ్లో బిగ్ బాస్ భార్య దారుణ హత్య.. రంగంలోకి దిగిన పోలీసులు..