Bigg Boss Telugu 7: సీరియల్ బ్యాచ్ కుట్రలను బయటపెట్టిన నాగార్జున... అడ్డంగా దొరికిపోవంతో తెల్ల మొహాలు!
బిగ్ బాస్ సీజన్ 7 మరో వీకెండ్ కి చేరుకుంది. హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగాడు. వారం రోజులుగా హౌస్లో జరిగిన విషయాల మీద సమీక్ష పెట్టాడు. ఈ క్రమంలో కొందరిని వాయించేశాడు.
Bigg Boss Telugu 7
ఎపిసోడ్ ఆసక్తికరంగా మొదలైంది. శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. నీకు గాయం తగిలింది. భుజం ఎలా ఉందని అడిగాడు. నొప్పి పూర్తిగా తగ్గలేదని చెప్పాడు. అయితే ఇకపై నీ ఆరోగ్యం నీదే బాధ్యత. బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేదా వెళ్లిపోవచ్చని చెప్పాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hg3mbbwb0g4jp0cw54x4630s/whatsapp-image-2023-11-25-at-21-24-49-jpeg_300x177xt.jpg)
Bigg Boss Telugu 7
శివాజీకి వెళ్లి పోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ నాగార్జున సర్ది చెప్పి ఆపాడు. తర్వాత పెద్ద పంచాయితీ జరిగింది. అమర్ కెప్టెన్ కాకుండా ఉండేందుకు శివాజీ కారణమని అందరూ ఆరోపిస్తుండగా నాగార్జున ఈ మేటర్ తెరపైకి తెచ్చాడు. మొదట శివాజీని తప్పుబట్టిన నాగార్జున, చివరికి అమర్ దే తప్పు అని తేల్చాడు.
Bigg Boss Telugu 7
ఈ ఎపిసోడ్ లో చోటు చేసుకున్న కీలక పరిణామం. సీరియల్ బ్యాచ్ కన్నింగ్ గేమ్ నాగార్జున ఎక్స్ పోజ్ చేశాడు. దాంతో శివాజీ ఇమేజ్ మరోసారి పెరిగింది. ప్రియాంక మీద శివాజీ ఆరోపణలు చేశాడు. అయితే కొన్ని విషయాల్లో ఆమె దొరికిపోయినట్లు నాగార్జున చూపించాడు.
Bigg Boss Telugu 7
ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ కి మించి స్టార్ మా బ్యాచ్ కన్నింగ్ గేమ్ బయటకు వచ్చింది. అమర్, శోభ, ప్రియాంక మొదటి నుండి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. ఇదే విషయాన్ని శివాజీకి ఎక్స్ పోజ్ చేశాడు. ఈసారి నాగార్జున బయటపెట్టడంతో మేటర్ మరింత ఫోకస్ అయ్యింది.
Bigg Boss Telugu 7
కెప్టెన్సీ టాస్క్ లో శోభను సేవ్ చేసి మిగతా కంటెస్టెంట్స్ కి ప్రియాంక ఇలా బలి చేసిందో నాగార్జున వీడియో వేసి చూపించాడు. దాంతో శోభ, ప్రియాంక దొరికిపోయారు. నాగార్జున ప్రియాంకకు గట్టిగా ఇచ్చాడు. గ్రూప్ గేమ్ ఎక్స్ పోజ్ అయ్యింది.
Bigg Boss Telugu 7
మరోవైపు ఎలిమినేషన్ లో 8 మంది ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు. సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు. రేపు ఆమె వేదిక మీదకు రానుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో అశ్విని ఒకరు.
Bigg Boss Telugu 7
అశ్వినితో పాటు రతికి ఎలిమినేట్ కానుందని సమాచారం. నేటి ఎపిసోడ్లో కొందరినే మెచ్చుకున్న నాగార్జున హౌస్లో జరిగే పరిణామాల మీద సీరియస్ అయ్యాడు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ అమర్, ప్రియాంక, శోభలకు ఇచ్చి పడేశాడు.