బుల్లి తెర మీద విజయ్ దేవరకొండ.. బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్గా!
కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ హాడావిడి ఓ రేంజ్లో కనిపించి ఉండేది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతి ఇస్తుండటంతో బిగ్ బాస్ పనులు ప్రారంభించారు చిత్రయూనిట్.
దేశ విదేశాల్లో ఘన విసయం సాధించిన టాప్ టెలివిజన్ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సూపర్ హిట్ అయ్యింది. తొలి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించగా తరువాత సీజన్కు నాని, మూడో సీజన్కు కింగ్ నాగార్జునలు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 4కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఈ సీజన్కు కూడా నాగర్జున నే హోస్ట్ చేస్తాడన్న టాక్ వినిపించింది. కానీ తాజా పరిస్థితులతో పాటు ఇప్పటికే కమిట్ అయిన సినిమాల కారణంగా నాగ్ బిగ్ బాస్ సీజన్ 4ను హోస్ట్ చేసేందుకు రెడీగా లేడన్న టాక్ వినిపించింది.
దీంతో నాగ్ స్థానంలో అక్కినేని కోడలు సమంత వ్యాఖ్యతగా వ్యవహరించబోతుందన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో తాజా మరో ఇంట్రస్టింగ్ పేరు తెర మీదకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4కు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడట. ప్రస్తుతం ఈ వార్తలు ఫిలిం సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి.
షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్షలు షోలు పాల్గొనే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. వీరికి తోడు బిత్తిరి సత్తి పేరు కూడా ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది.