దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ కీర్తి... లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ కి, ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కీర్తి మోసగాళ్ల బారిన పడ్డారు. లక్షల రూపాయలు కోల్పోయారు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కీర్తి భట్ పరిచయం అక్కర్లేని పేరు. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి స్ట్రాంగ్ ప్లేయర్ గా నిరూపించుకుంది. ఫైనల్ కి వెళ్ళింది. ఆమెకు 4వ స్థానం దక్కింది.
ప్రస్తుతం మధురానగరిలో అనే ఓ సీరియల్ చేస్తుంది కీర్తి. ఇది స్టార్ మా లో ప్రసారం అవుతుంది. కార్తీక్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించారు. అతనితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. కీర్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ తన వ్యక్తిగత విషయాలు సైతం పంచుకుంటుంది.
Keerthi Bhat
తాజాగా ఆమె దారుణంగా మోసపోయినట్లు వీడియో విడుదల చేసింది. లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారట. అది ఎలా జరిగిందో బిగ్ బాస్ కీర్తి వెల్లడించింది. ఆమెకు ఒక పార్సిల్ రావాల్సి ఉండగా... దానికి ట్రాక్ చేసింది. ఇంతలో ఆమెకు ఒక ఫోన్ వచ్చిందట.
వాళ్ళు పార్సిల్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా అని అడిగారట. అవునని చెప్పగా... ఒక లింక్ పంపారట. సదరు లింక్ పై క్లిక్ చేయగా మొదట రెండు రూపాయలు కట్ అయ్యాయట. రెండు రూపాయలే కదా అనే లైట్ తీసుకుందట. తర్వాత రూ. 90 ఒకసారి మరో రూ. 90 వేలు... అలా మొత్తం రూ. 2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయట.
వెంటనే కార్తీక్ కి చెప్పగా... సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేద్దాం అన్నాడట. అకౌంట్ బ్లాక్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. 90% మీ డబ్బులు వెనక్కి వస్తాయని పోలీసులు హామీ ఇచ్చారట. చాలా తెలివిగా తనను మోసం చేశారని కీర్తి వాపోయింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Keerthi Bhat
డిజిటల్ విధానం ప్రాచుర్యం పొందగా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోసగాళ్లు ఏదో ఒక విధంగా ట్రాప్ చేస్తున్నారు. బిగ్ బాస్ కీర్తి కష్టపడి సంపాదించుకున్న రూ. 2 లక్షలు పోగొట్టుకుని బాధపడుతుంది...