ఏ ఆర్ రెహమాన్ , జేమ్స్ కెమెరాన్ లపై బాలయ్య షాకింగ్ కామెంట్స్
రీసెంట్గా 'మా'కు సంబంధించి బాలయ్య కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రముఖ దర్శకుడు ఎఆర్ రహమాన్ మీదా, జేమ్స్ కేమరాన్ పైనా వ్యాఖ్యలు చేసారు.
నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూల ద్వారా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు.ఈ మధ్య బాలకృష్ణ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. రీసెంట్గా 'మా'కు సంబంధించి బాలయ్య కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రముఖ దర్శకుడు ఎఆర్ రహమాన్ మీదా, జేమ్స్ కేమరాన్ పైనా వ్యాఖ్యలు చేసారు.
రీసెంట్ గా ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు బాలయ్య. ఇంటర్వ్యూలో భాగంగా ఆదిత్య 369లో అన్నిపాటలు చాలా హిట్, జాణవులేపాట ఇంకా హిట్ అని యాంకర్ అనగానే, బాలయ్య జిక్కీగారు పాడారు అని చెప్పారు.ఇళయరాజా మ్యూజిక్ అద్భుతం అని చెబుతూ.. ప్రేక్షకుడిగా, విమర్శకుడిగా చెబుతాను. అది ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ఎవరు నమ్మరు.
‘ఆదిత్య 369 సినిమాను గమనించారో లేదో ఇళయరాజా మ్యూజిక్ అంటే ఎవరూ నమ్మరు. అది ఇళయరాజా మ్యూజిక్ అంటే! ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది.. అంటూ రెహమాన్ పేరు ఎత్తారు. రెహమాన్ ఎవరో నాకు తెలియదు. నేను పట్టించుకోను. పదేళ్లకు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్ అందుకుంటారు.. అయినా పట్టించుకోను అన్నారు.
తాను చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తానని, జేమ్స్ కెమెరాన్ వంటి డైరక్టర్స్ లాగ పదేళ్లు తీసుకోనని అన్నారు. తక్కువ సమయంలో సినిమాలు పూర్తి చేయటం, ఎక్కువ హిట్స్ కొట్టడం తన
స్టైల్ అని అన్నారు. జేమ్స్ కెమెరాన్ విషయం బాలయ్య ఎందుకు ఎత్తారో ఎవరికీ అర్దం కావటంలేదు. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సినిమాల్లో ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో స్టాంప్ ఉంటుంది. ఇది మణిశర్మ మ్యూజిక్, దేవిశ్రీప్రసాద్ సంగీతం, ఇది థమన్ సినిమా.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కానీ, ఆదిత్య 369లో ఎక్కడా ఇళయరాజా సంగీతం కనిపించదు. అంటే, ఇది ఆయనలోని వేరియేషన్స్ అన్నారు.
భారతరత్న రామారావు గారంటే ఆయన చెప్పుతో సమానం, కాలి గోటితో సమానం అన్నారు చివరికి.ఇచ్చినోళ్లకు గౌరవం కాని, ఆయనకు గౌరవం ఏంటి? అని అన్నారు బాలయ్య. అసలు ఇళయరాజా గురించి ప్రస్తావిస్తూ రెహమాన్ని ఎందుకు విమర్శించాడో, మధ్యలో రామారావుని ఎందుకు తీసుకొచ్చాడో తెలియటం లేదు.
ఆదిత్య369 సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పిన ఆయన ఈ సినిమా ద్వారా తన తనయుడిని వెండితెర ఆరంగేట్రం చేయించబోతున్నట్టు మరోసారి గుర్తు చేశారు. .. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు కూడా పేర్కొన్నారు.
సినీ తారలతో బాలకృష్ణ అరుదైన, ఎప్పుడూ చూడని కొత్త చిత్రాలు.
ఈ విషయాలపై ఇంటర్నెట్ లో చర్చ జరుగుతోంది. ఏంటీ AR రెహమాన్ నీకు తెలీదా? తెలియకనే నీ నిప్పురవ్వ సినిమాకి పనిచేయించుకున్నావా? ఏంటి భారతరత్న బిరుదు కాలిచెప్పుతో సమానమా నీకు.. ఎన్టీఆర్కి బిరుదులు ఇస్తే, ఇచ్చేవాడికి గౌరవమా?’’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఇప్పటి వరకు ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు.
గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్లో ఫ్లైట్లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సినీ పెద్దలు కలిసి వస్తే ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.