- Home
- Entertainment
- Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్ కూడా
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్ కూడా
Duniya Vijay Divorce: కన్నడ నటుడు దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్నకు కర్ణాటక హైకోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పు ప్రకారం, విజయ్ తన భార్య నాగరత్నకు శాశ్వత భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలి.

భార్యతో దునియా విజయ్కి విడాకులు మంజూరు చేసిన హైకోర్ట్
కన్నడ నటుడు, డైరెక్టర్ అయిన 'దునియా' విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న వైవాహిక బంధం అధికారికంగా ముగిసింది. ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న ఈ విడాకుల కేసును కర్ణాటక హైకోర్టు పరిష్కరించింది. ఈ జంటకు అధికారికంగా విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్కి కోర్ట్ కండీషన్లు
విడాకులు మంజూరు చేయడంతో పాటు, భార్య నాగరత్నకు శాశ్వత భరణం (Permanent Alimony) కింద ఏకంగా రూ.2 కోట్లు చెల్లించాలని నటుడు దునియా విజయ్ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అంతేకాదు పిల్లల బాధ్యత కూడా విజయ్దే అని చెప్పడం విశేషం.
భార్యకి 2 కోట్ల భరణం
నటుడు దునియా విజయ్ విడాకుల కోసం వేసిన పిటిషన్ను జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతిభూషణ్లతో కూడిన కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుంది. దునియా విజయ్ సామాజిక హోదా, కెరీర్, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి, భార్యకు రూ.2 కోట్ల భరణం ఇవ్వాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
పిల్లల బాధ్యత విజయ్ దే
విజయ్, నాగరత్న దంపతులకు ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం, ఈ ముగ్గురు పిల్లల పోషణ, చదువు, ఇతర పూర్తి బాధ్యతలను నటుడు దునియా విజయ్ చూసుకుంటారు.
ఏళ్లనాటి కుటుంబ కలహాలకు తెర
దునియా విజయ్, నాగరత్న మధ్య కుటుంబ గొడవలు గతంలో పోలీస్ స్టేషన్, మీడియా, ఫ్యామిలీ కోర్టు వరకు వెళ్లాయి. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల పిటిషన్ను తిరస్కరించడంతో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత, ఈ జంట మళ్లీ కలిసి జీవించడం అసాధ్యమని హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ధారించింది. దీంతో షరతులతో కూడిన విడాకులు మంజూరు చేసి, ఈ హై ప్రొఫైల్ కుటుంబ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టింది.
దునియా విజయ్ ఆ మధ్య టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ బాలయ్య హీరోగా నటించిన `వీరసింహారెడ్డి` చిత్రంలో విలన్గా నటించాడు. ఇక ప్రస్తుతం ఆయన ఐడీ రంగానికి చెందిన కీర్తి గౌడతో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు విడాకులు రావడంతో అధికారికంగా పెళ్లి చేసుకుంటారని సమాచారం.

