బాలయ్య సినిమాలను మార్చేసిన మహిళ ఎవరు..? బాలకృష్ణ సినిమాలపై ఆ లేడీ ప్రభావం ఎంత.. ?
బాలకృష్ణ సినిమాలపై ఓ మహిళ ప్రభావం గట్టిగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె సలహాలతోనే ఆయన వరుస హిట్లు కొడుతున్నాడట. ఇంతకీ ఎవరామె.

టాలీవుడ్లో మాస్ కి పెట్టింది పేరు బాలకృష్ణ. `అఖండ`, `వీర సింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` వంటి సినిమాలతో తన సత్తా చాటారు. ఇప్పుడు మాస్ సినిమాల మోగుడు బోయపాటి శ్రీను `అఖండ 2`లో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. శివ తత్వం, ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారట. ఇది `అఖండ` కంటే మెరుగ్గా ఉంటుందని, బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.
ఈలోగా బాలకృష్ణ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణను మాస్ గా చూపించడంలో బోయపాటే దిట్ట అనుకుంటున్న తరుణంలో గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి`లో బాలకృష్ణను వేరేలా చూపించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందట. బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. `అఖండ 2: తాండవం` తర్వాత గోపీచంద్ మలినేని సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజున ఈ సినిమా ప్రారంభం కానుందని అంటున్నారు. అయితే, ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` తర్వాత రవితేజతో సినిమా చేయాల్సి ఉంది. కానీ, బడ్జెట్ పెరుగుతుందని ఆ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లోకి అడుగుపెట్టి సన్నీ డియోల్తో `జాట్` అనే మాస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా మొదలవుతుందని సమాచారం.
బాలకృష్ణ ఈ విజయాలు సాధించడానికి ఒక మహిళ కారణమట. యువ దర్శకులతో సినిమాలు చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నారట. ఆమె సలహా మేరకు బాలకృష్ణ తనను తాను మార్చుకుని సినిమాలు చేస్తున్నారట. ఆమె ఎవరో కాదు, ఆయన చిన్న కుమార్తె తేజస్విని. `అన్స్టాపబుల్` షో నుంచి ఆ తర్వాత వచ్చిన సినిమాల వెనుక ఆమె హస్తం ఉందని అంటున్నారు.