అవంతిక మిశ్రా క్లీవేజ్ షో.. నితిన్ హీరోయిన్ వెరైటీగా ఎరవేస్తుందిగా!
అవంతిక మిశ్రాకి తెలుగులో రాణించేందుకు ఉవ్విళ్లూరుతుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. దీంతో గ్లామర్కి పనిచెప్పింది. తనలోని అందాలను కొత్తగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఫోటో షూట్లో రెచ్చిపోయింది. క్లీవేజ్ షో చేస్తుంది.
అవంతికి మిశ్రా.. న్యూఢిల్లీకి చెందిన ఈ భామ మోడలింగ్తో కెరీర్ని ప్రారంభించింది.
అంతకు ముందు ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్లో ఉన్నత విద్యని పూర్తి చేసింది. కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యూయేట్ పూర్తి చేసింది.
చదువుకునే టైమ్ నుంచే మోడలింగ్ ప్రారంభించింది. తన గ్లామర్కి పనిచెప్పింది.
ఈ బ్యూటీ తెలుగు దర్శకుడు నీలకంఠ దృష్టిలో పడింది.
ఆడిషన్ చేసిన పది నిమిషాల్లోనే ఎంపికైందీ బొమ్మ.
ఆయన దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ చిత్రం `మాయ`లో హీరోయిన్గా ఎంపికైంది.
తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.
కానీ తన టాలెంట్కి తగ్గట్టు సినిమాలు పడలేదు. సినిమాల ఎంపికలో తడబడిందనే చెప్పాలి.
ఆ తర్వాత `మీకు మీరు మాకు మేమే` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత `వైశాఖం` చిత్రాల్లో మెరిసింది.
ఈ సినిమాలు పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో ఈ అమ్మడికి అంత గుర్తింపు రాలేదు.
గతేడాది `మీకు మాత్రమే చెప్తా` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.
దీంతోపాటు నితిన్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన `భీష్మ`లోనూ గెస్ట్ రోల్లో మెరిసింది. కాసేపైనా బాగానే అలరించిందీ బ్యూటీ.
ప్రస్తుతం తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ, `నెంజమెల్లమ్ కాదల్` చిత్రంలో నటిస్తుంది.
తెలుగులో ఈ బ్యూటీకి ఇప్పుడు ఆఫర్స్ లేవు. దీంతో గ్లామర్ ఫోటోలతో అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది.
ఇలా చూసైనా తనకు ఛాన్స్ లు వస్తాయేమో అని ఆశపడుతుంది.
మరి అవంతిక కోరిక నెరవేరుతుందా? ఆమెకి అవకాశాలు వరిస్తాయా? అన్నది చూడాలి.
కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.