`ఘాటి` సినిమాకి అనుష్క తీసుకున్న శాలరీ ఎంతో తెలుసా? అస్సలు ఊహించరు
అనుష్క శెట్టి నటించిన మూవీ `ఘాటి` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి అనుష్క ఎంత పారితోషికం తీసుకుందనేది తెలుసుకుందాం.

స్వీటిగా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తోన్న స్వీటి
ఒకప్పుడు దక్షిణ భారత సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నటించిన అనుష్క శెట్టి తెలుగు ఆడియెన్స్ ని స్వీటిగా ఆకట్టుకుంది. `సూపర్`, `అరుంధతి`, `వేదం`, `మిర్చి`, `బాహుబలి`, `బాహుబలి 2` వంటి చిత్రాల్లో నటించారు. చివరిగా రెండేళ్ల క్రితం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంతో అలరించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు `ఘాటి` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
సెప్టెంబర్ 5న `ఘాటి` విడుదల
దర్శకుడు క్రిష్ జెగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్య రావు, జాన్ విజయ్, విటివి గణేష్ వంటి వారు ఇందులో నటించారు. ఈ సినిమాకి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. తెలుగులో నిర్మించిన ఈ చిత్రం తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా నటుడు విక్రమ్ ప్రభు తొలిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదల కాబోతుంది.
`ఘాటి` కథ ఇదేనా?
`ఘాటి` సినిమా పూర్తిగా యాక్షన్తో సాగుతుందట. అంతేకాకుండా ఈ సినిమాలో శీలావతిగా నటించిన అనుష్క గంజాయి వ్యాపారిగా కనిపిస్తారట. అంతేకాకుండా, ఈ సినిమా ప్రతీకారం తీర్చుకునే కథా నేపథ్యంలో ఉంటుందని భావిస్తున్నారు. రా అండ్ రస్టింగ్గా మూవీ ఉంటుందని, ఎమోషనల్గా, యాక్షన్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది.
అనుష్క `ఘాటి` పారితోషికం
చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఆమె పారితోషికానికి సంబంధించిన వార్త ఆసక్తికరంగా మారింది. ఈ మూవీకిగానూ అనుష్క రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు నయనతార, త్రిష, దీపికా, రష్మిక వంటి హీరోయిన్లు దాదాపు పది కోట్లు, ఆ పైనే తీసుకుంటున్నారు. కానీ అనుష్క మాత్రం తక్కువగానే తీసుకోవడం గమనార్హం. ఈ సినిమా తర్వాత అనుష్క మలయాళంలో `కాతనాడు` అనే చిత్రంలో నటిస్తోంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ నటించిన తొలి చిత్రమిది.