- Home
- Entertainment
- Anupama Parameswaran: మైమరపించేలా అనుపమ లేటెస్ట్ ఫొటోస్.. హార్ట్ టచింగ్ కామెంట్స్ వైరల్
Anupama Parameswaran: మైమరపించేలా అనుపమ లేటెస్ట్ ఫొటోస్.. హార్ట్ టచింగ్ కామెంట్స్ వైరల్
అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఆగష్టు 13న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో అనుపమ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఆగష్టు 13న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో అనుపమ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.
చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అనుపమ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది.
శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో క్లాసీ లుక్ తో అనుమప ఇస్తున్న ఫోజులు అద్భుతంగా ఉన్నాయి. చిలిపి పిల్లలాగా సొగసైన చీరలో అనుపమ మురిపిస్తోంది.
బ్లూ శారీలో అనుపమ నేలపై కూర్చుని చెలికాడి కోసం ఎదురుచూస్తున్నట్లు, అతడి తలపుల్లో విహరిస్తున్నట్లు సిగ్గుపడుతూ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఇక అనుపమ ఈ ఫొటోస్ కి ఎమోటినల్ కామెంట్ జోడింగింది. తాను ఈ ఫొటోస్ లో వాళ్ళ అమ్మలాగే ఉన్నట్లు కామెంట్ పెట్టింది.
అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది.
ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ2 చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు.