యాంకర్ ఉదయభాను కవల పిల్లలు ఇప్పుడెలా ఉన్నారో చూశారా? వాళ్లు ఏం చేస్తున్నారంటే?
ఒకప్పిడు స్టార్ యాంకర్ గా రాణించింది ఉదయభాను. ఆమెకి ఇద్దరు ఆడ కవల పిల్లలు. ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

యాంకర్ సుమకి పోటీ ఇచ్చిన ఉదయభాను
ఒకప్పుడు బుల్లితెరని శాసించింది ఉదయభాను. అప్పట్లో యాంకర్ సుమకి పోటీ ఇచ్చిన ఏకైక యాంకర్ ఉదయభాను అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తిరుగులేని స్టార్ యాంకర్గా రాణించింది. తెలంగాణ యాస ఆమెని ప్రత్యేకంగా నిలిపింది. మహిళా కార్యక్రమాలు, పాటల షోలకు, ముఖ్యంగా జానపద పాటలకు సంబంధించిన షోలకు ఆమె యాంకర్గా వ్యవహరించింది. దాదాపు 2000 నుంచి యాంకర్గా రాణించి విశేషంగా ఆకట్టుకుంది ఉదయభాను.
KNOW
మధ్యలో యాంకరింగ్కి దూరమైన ఉదయభాను
సుమారు పది, పదిహేనేళ్లపాటు బుల్లితెరని ఓ ఊపు ఊపేసిన ఉదయభాను సడెన్గా కనుమరుగయ్యింది. కొందరు తొక్కేశారనేది ఒక వాదన. తాను కూడా అడపాదడపా ఈ కామెంట్స్ చేసింది. మరోవైపు వ్యక్తిగత కారణాలున్నాయనే కామెంట్ కూడా వినిపించింది. ఫ్యామిలీ ఇష్యూస్ కూడా తాను దూరం కావడానికి కారణమని అంటుంటారు. కానీ ఇప్పుడు మళ్లీ అడపాదడపా బుల్లితెరపై మెరుస్తోంది ఉదయభాను. స్పెషల్ షోస్లో యాంకర్గా ఆకట్టుకుంటుంది.
`బార్బరిక్` మూవీతో రాబోతున్న ఉదయభాను
ఇటీవల కాలంలో ఆమె `బొమ్మ బొరుసు`, `నీతోనే డాన్స్`, `గ్యాంగ్ లీడర్` వంటి షోస్ చేస్తూ రాణిస్తోంది. అదే సమయంలో సినిమాల్లోనూ మెరుస్తోంది. తాజాగా `బార్బరిక్` అనే మూవీలో నటించింది. ఇది ఆగస్ట్ 22న ఇది విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఉదయభాను ఇండస్ట్రీలో తనని తొక్కేసిన విషయం గురించి స్పందించింది. దీనిపై త్వరలో స్పందిస్తానని, ఇది వేదిక కాదని చెప్పింది. అదే సమయంలో తన కూతుళ్ల గురించి రియాక్ట్ అయ్యింది. తన కూతుళ్ల కోసం ఓ పాట రాసినట్టు, త్వరలో దాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది.
ఉదయభాను కవల కూతుళ్లని చూశారా?
`నా బేబీస్పైన ఓ పాట రాశాను. త్వరలో దాన్ని రిలీజ్ చేస్తాను. నా పిల్లలంటే నాకు ప్రాణం` అని చెప్పింది. మరి ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారనేది చూస్తే. ఉదయభాను 2004లో విజయ్ కుమార్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కవల కూతుళ్లు జన్మించారు. వారి పేరు భూమి, యూవి. ఈ ఇద్దరు పిల్లలు, భర్తనే సర్వస్వంగా బతుకుతుంది ఉదయభాను. అంతేకాదు వారిపై రెగ్యూలర్గా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. పిల్లలంటే ఎంత ప్రేమ అనేది చాటి చెబుతుంది.
ఉదయభాను కూతుళ్లు ఏం చేస్తున్నారంటే?
ప్రస్తుతం ఉదయభాను కూతుళ్లకి ఇప్పుడు 9ఏళ్లు. ప్రస్తుతం ఫోర్త్ క్లాస్ చదువుతున్నారని చెప్పొచ్చు. అయితే ఆ వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్కి చెందిన ఉదయభాను.. నటిగా రాణించాలని సినిమాల్లోకి వచ్చింది. నటిగా అడపాదడపా సినిమాలు చేసింది. కానీ అందులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ బుల్లితెర ఆమెకి గుర్తింపుని తీసుకొచ్చింది. స్టార్ని చేసింది. యాంకర్గా విశేషంగా అలరించింది ఉదయభాను. ఆమె యాంకర్గా చేసిన వాటిలో `డాన్స్`, `ఛాలెంజ్`, `వన్స్ మోర్ ప్లీజ్`, `సాహసం చేయరా డింబకా`, `జానవులే నెరజానవులే`, `నువ్వు నేను`, `లక్స్ డ్రీమ్ గర్ల్`, లక్కీ లక్ష్మీ``, `ఛాంగురే బంగారు లేడీ`, `డాన్సింగ్ స్టార్స్`, `గోల్డ్ రష్`, `తీన్ మార్`, `రేలా రే రేలా`, `రంగం`, `ఢీ`, `పిల్లలు పిడుగులు`, `అంతఃపురం`, `నీతోనే డాన్స్` వంటి షోస్ ఉన్నాయి.

