కెవ్వు కార్తీక్ దీన గాధ విని కన్నీరు పెట్టుకున్న యాంకర్ సుమ
స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా ఈటీవిలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం చాలా పాప్యులర్. సెలెబ్రిటీలు పాల్గొనే ఈ షోకి అత్యంత ప్రేక్షాదరణ ఉంది. తాజాగా ఈ షోలో జబర్దస్త్ కార్తీక్, యాంకర్ రవి, వర్షిణి మరియు బిగ్ బాస్ ఫేమ్ భాను పాల్గొనడం జరిగింది. ఈసారి ఎపిసోడ్ లో యాంకర్స్ తో పాటు వాళ్ళ మదర్స్ కూడా పాల్గొనడం జరిగింది.
సుమపై యాంకర్ రవి పంచ్ లు, నవ్వు తెప్పించే ఆమె ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పించాయి. సడన్ గా ఈ షోలో అందరూ ఎమోషనల్ అయ్యారు. కెవ్వు కార్తీక్ తన తల్లి ఆరోగ్యం, ఆమె పడిన కష్టాల గురించి చెప్పి అందరినీ ఏడిపించేశాడు.
షోలో కెవ్వు కార్తీక్ చిన్నప్పటి నుండి తల్లితో దిగిన ఫోటోలు చూపించి... కార్తీక్ ని వాళ్ళ అమ్మ గురించి ఏమైనా మాట్లాడాలని అడిగారు. దానికి కార్తీక్ తల్లి ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
మా అమ్మ ఓ యోధురాలు..ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్స్, ముప్పై కిమో థెరపీలు జరిగాయి. ఒక సమయంలో అమ్మ శరీరంతో పాటు ఓ బ్యాగ్ తో ఇబ్బంది పడ్డారని అన్నారు. జబర్దస్త్ కి వచ్చిన తరువాతే కడుపునిండా అన్నం తిన్నాం. చాల మంది కమెడియన్స్ ఈ వేదిక ద్వారా ఫేమస్ అయ్యారు అన్నారు.
ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఇల్లు, కార్లు కొనుకున్నాం. అలాగే సంపాదించిన డబ్బుతో అమ్మకు వైద్యం చేయించి...కాపాడుకో గలిగాను అని కార్తీక్ చెప్పుకొచ్చారు.
తన తల్లి గురించి చెవుతూ కార్తీక్ కన్నీరు పెట్టుకున్నారు. మా తల్లిదండ్రలు జన్మను ఇస్తే...కార్తీక్ తనకు పునర్జన్మను ఇచ్చాడని తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు.
కార్తీక్ తల్లి గురించి తెలుసుకున్న షోలో కి హాజరైన రవి, వర్షిణి, భాను ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్ సుమ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది.
క్యాష్ ప్రోమోలో ఈ ఎమోషనల్ సన్నివేశం చూపించగా ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగిపోయింది.