రంగుల చోళీ, మెరిసే మేను, కట్టిపడేస్తున్న శ్రీముఖి అరవిరిసిన అందాలు..!
టాప్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి పోస్ట్ చేసే ఫోటో షూట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు.
తాజాగా డిజైనర్ లెహంగా చోళీలో ఆమె మెరిసిపోయారు. బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో కోసం ట్రెండీగా తయారైన శ్రీముఖి అందాలతో కట్టిపడేశారు.
రెడ్ గ్రీన్ కాంబినేషన్ చోళీ, క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో శ్రీముఖి ముస్తాబు అయ్యారు. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా ధరించిన ఆభరణాలు శ్రీముఖి అందాన్ని మరింత పెంచేశాయి.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలకు ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫోటోలను వైరల్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.
ప్రస్తుతం శ్రీముఖి గోవా టూర్ లో ఉన్నారు. ఆమె మిత్రులతో కలిసి గోవా బీచ్ లలో ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీముఖి గోవా వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. సాగర తీరంలో హాట్ హాట్ ఫోజులతో హీటెక్కించింది శ్రీముఖి.
బిజీ లైఫ్ కి బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఆమె. శ్రీముఖి బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీ అవుతున్నారు.
శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ అనే చిత్రం తెరకెక్కింది. ఆ మధ్య విడుదలైన ఆ చిత్ర టీజర్ ఆకట్టుకుంది.
క్రేజీ అంకుల్స్ మూవీలో సింగర్ మను, భరణి మరియు రాజా రవీంద్ర కీలక పాత్రలు చేస్తున్నారు.
క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి రోల్ కొంచెం బోల్డ్ గా ఉండే సూచనలు కలవు.
అలాగే మరి కొన్ని సినిమాలలో శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం ఉంది.