పింక్ సింక్ అయ్యింది, బ్యూటీ డబుల్ అయ్యింది...రాత్రి ప్రోగ్రామ్ కోసం రంజుగా రెడీ అయిన శ్రీముఖి
పిల్ల పింక్ డ్రెస్ లో కేక పుట్టించింది. లాంగ్ స్లీవ్స్ ఫ్రాక్ అమ్మడి అందాన్ని డబుల్ చేసింది. నేటి టెలివిజన్ ప్రోగ్రాం కోసం రంజుగా రెడీ అయిన శ్రీముఖి కొత్త ఫోటో షూట్ తో కాకరేపింది.
అనసూయ, రష్మీల తరువాత గ్లామరస్ యాంకర్ గా పేరు గాంచింది శ్రీముఖి. బుల్లితెరకు పరిచమైన అతితక్కువ కాలంలోనే ప్రేక్షకులలో ఫేమ్ తెచ్చుకుంది.
సాలిడ్ అందాలను ట్రెండీ బట్టలలో ప్రదర్శిస్తూ.. కామెడీ పంచ్ లతో అదరగొడుతూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంది.
పటాస్ స్టాండప్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయమైన శ్రీముఖి, ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో బుల్లితెరపై బిజీ అయ్యారు.
ఇక 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులర్ అయ్యారు. ఆ సీజన్ ఫైనల్ కి చేరిన శ్రీముఖి, సింగర్ రాహుల్ సింప్లి గంజ్ తో పోటీపడి కొద్దిలో టైటిల్ మిస్ అయ్యారు.
టైటిల్ చేజారిన పారితోషికం పరంగా గట్టిగా రాబట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. విన్నర్ కంటే ఎక్కువే అందుకుంది అందరూ చెప్పుకున్నారు.
నటిగా కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీముఖి, హీరోయిన్ గా కూడా మారారు. ఆమె సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ మూవీలో ఆమె నటించారు.
ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు బిజినెస్ ఉమన్ గా మారి వ్యాపారాలు చేస్తుంది. లువా పేరుతో బ్రాండ్ చైన్ స్టోర్స్ ని నడుపుతున్నారు శ్రీముఖి.
మరోవైపు అనేక ఉత్పత్తులకు, సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ మంచిగా సంపాదిస్తున్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరికొంత ఆర్జన రాబడుతున్నారు.
నటిగా, యాంకర్ గా, బిజినెస్ ఉమెన్ గా పలు రాగాలలో రాణిస్తూ సత్తా చాటుతుంది.. ఈ బుల్లితెర రాములమ్మ. ఇక నేడు రాత్రి ప్రసారం కానున్న స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్ ఈవెంట్ కోసం పింక్ డ్రెస్ లో ట్రెండీగా రెడీ అయ్యారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..