సింగర్ సునీత ముందే యాంకర్ ప్రదీప్కి `ఐ లవ్యూ` చెప్పిన శ్రీముఖి.. దీని కోసమే ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్నాడట
యాంకర్ శ్రీముఖి, యాంకర్ ప్రదీప్ మాచిరాజు మధ్య సమ్ థింగ్ సమ్థింగ్ అంటూ గతంలో వార్తలొచ్చాయి. అవి నిజమే అని నిరూపించింది శ్రీముఖి. బహిరంగంగా ఐ లవ్యూ చెప్పి షాక్ ఇచ్చింది.
యాంకర్లు శ్రీముఖి, ప్రదీప్ ఒకేసారి తమ కెరీర్ని ప్రారంభించారు. ఇద్దరూ యాంకరింగ్లో పీక్లోకి వెళ్లారు. ఆ టైమ్లోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ పుకార్లు షికారు చేశాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
కానీ తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ ఆ వార్తలను ఖండించారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన షోస్ అన్నీ టాప్ రేటింగ్తో దూసుకుపోవడంతో వీరి కెమిస్ట్రీని మరింత రక్తికట్టించేలా చూపించారు టీవీ షోస్ నిర్వహకులు.
కానీ ఆ ఎఫైర్ వార్తలు ఊపందుకోవడంతో కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. అడపాదడపా వీరిద్దరు కలిసి షోస్లో కనిపిస్తున్నారుగానీ, షోస్ చేయడం లేదు. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టయ్యింది.
తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి `డ్రామాజూనియర్స్ `లో మెరిశారు. ప్రదీప్ హోస్ట్ గా రన్ అవుతున్న ఈ షోలో సునీత, ఎస్వీ కృష్ణారెడ్డి జడ్జ్ లుగా ఉన్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖి గెస్ట్ గా పాల్గొన్నారు. షోలో సందడి చేశారు.
తాజాగా విడుదలైన ప్రోమో ఇప్పుడు వైరల్గా మారింది. ఇందులో శ్రీముఖి చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారాయి. శ్రీముఖి, ప్రదీప్ మధ్య ఉన్న ఎఫైర్ వార్తలకు ఆజ్యం పోసినట్టైంది. అంతేకాదు బహిరంగంగానే ప్రదీప్పై ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది శ్రీముఖి.
`అందాలలో అహో మహోదయం` అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ వచ్చి తన మనసులో మాటను బయటపెట్టింది. `నీకు ఓ మాట చెప్పాలి` అంటూ సిగ్గులు పోతూ `ఐ లవ్యూ` చెప్పింది.
దీనికి సునీత, ఎస్వీకృష్ణారెడ్డిలు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రదీప్ ముసి ముసి నవ్వులతో సిగ్గులు పోయాడు.
దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో,యూట్యూబ్లో వైరల్ అవుతుంది.
దీంతో వీరిపై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. త్వరలో పెళ్లికి రెడీ అంటూ, క్రేజీ జోడీ కమ్బ్యాక్ అంటూ, ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.