స్వర్గాన్ని తలపించే మెగాస్టార్ ఇల్లు.. ఇంద్రభవనమే జల్సా!
బాలీవుడ్ మెగాస్టార్ స్టార్ అమితాబ్ కుటుంబమంతా కరోనా సోకటంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్కు సంబంధించి ఇంటర్నెట్లో ఓ రేంజ్లో సెర్చ్ చేస్తున్నారు అభిమానులు. దీంతో అమితాబ్ ఇళ్లు జల్సాకు సంబంధించిన ఆసక్తికర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంద్ర భవనాన్ని తలపించే అమితాబ్ ఇంటి ఫోటోలు ఓ సారి చూద్దాం.
1982లొ సత్తే పే సత్తా సినిమా షూటింగ్ సమయంలో చిత్ర దర్శకుడు రమేష్ సిప్పీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు 10000 చదరపు అడుగుల జల్సా బంగ్లాను బహుమతిగా ఇచ్చాడు.
అమితాబ్ తో పాటు ఆయన భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్, కొడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యలో ప్రస్తుతం ఈ ఇంట్లోనే నివసిస్తున్నారు.
ముంబైలోని జుహూ అనే ఏరియాలో ఉంది జల్సా. ఈ బంగ్లా దగ్గర ఎప్పుడూ అభిమానులు, టూరిస్ట్ల సందడి కనిపిస్తుంటుంది.
ప్రతీ ఆదివారం అమితాబ్ తన ఇంటి వద్దే అభిమానులను కలుస్తుంటాడు. అయితే కొంత కాలంగా కరోనా లాక్ డౌన్ ఉండటంతో అభిమానులను కలవటం మానేశాడు బిగ్ బీ.
1982 నుంచి అమితాబ్ ఇలా అభిమానులను కలుస్తున్నాడు. ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు బిగ్ బీ.
కూలీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయ స్థితికి వెళ్లి తిరిగి వచ్చిన అమితాబ్, తన ఇంటి నుంచి తన కోసం ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇంటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అమితాబ్, ఎప్పటికప్పుడు అధునాతన సౌకర్యాలతో ఇంటినీ ఆధునీకరిస్తుంటాడు. దేశ విదేశాలకు సంబంధించి ఇంటీరియర్తో ఆ ఇళ్లు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది.
జల్సా కన్నా ముందు అమితాబ్ ప్రతీక్ష అనే బంగ్లాలో ఉండేవాడు. ప్రస్తుతం అది కూడా అమితాబ్ ఆధీనంలోనే ఉంది. అమితాబ్ పేరెంట్స్ చివరి వరకు అదే బంగ్లాలో నివసించారు.
ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం జల్సా విలువ 120 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.