- Home
- Entertainment
- తండ్రి శివుడి వద్దకు కార్తికేయుడి ప్రయాణం.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా స్టోరీ ఇదే?
తండ్రి శివుడి వద్దకు కార్తికేయుడి ప్రయాణం.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా స్టోరీ ఇదే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా కథకి సంబంధించిన ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతుందట. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ అయ్యింది. అది తెలిస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ ని చెప్పొచ్చు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల `పుష్ప 2` తో సంచలన విజయాన్ని అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1900కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. `బాహుబలి` రికార్డులు బ్రేక్ చేసిందని, `దంగల్` రికార్డులు బ్యాలెన్స్ ఉన్నాయని అంటున్నారు.
అయితే త్వరలోనే దాన్ని కూడా బీట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతుందీ మూవీ. అయితే ఈ సినిమా కలెక్షన్లు ఫేక్ అనే వార్త వినిపించింది. ఐటీ శాఖ సోదాలు నిర్వహించినప్పుడు ఈ విషయం బట్టబయలు అయ్యింది.
ఈ సినిమా రిలీజ్ టైమ్లో నెలకొన్న వివాదం పెద్ద సంచలనంగా మారింది. దాని కారణంగా సైలెంట్గా మారిన బన్నీ కొంత గ్యాప్తో నెక్ట్స్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. మరి నెక్ట్స్ బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమానే ఉండబోతుందని తెలుస్తుంది.
read more: బాలయ్యకి పద్మభూషణ్.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ అదిరిపోయిందిగా
అయితే త్రిక్రమ్, బన్నీ మూవీ ఇప్పటి వరకు తెలుగులో రాని సబ్జెక్ట్ అని నిర్మాత నాగవంశీ తెలిపారు. భారీ స్థాయిలో ఉండబోతుందని, ఎవరూ ఊహించని విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే ఈ మూవీ కథేంటో బయటకు వచ్చింది.
శివుడి తనయుడు, యుద్ధ దేవుడిగా పిలవబడే కార్తికేయ జర్నీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. తండ్రి అయిన మహా శివుడిని తిరిగి కలవడానికి బయలు దేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించే ప్లాన్లో ఉన్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
allu arjun, trivikram srinivas, pan india movie
సోషల్ మైథలాజికల్ ఫాంటసీగా దీన్ని రూపొందించబోతున్నారట. భారీ కాన్వాస్పై ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్, అల్లు అర్జున్, నిర్మాతలు ఉన్నాయి. ప్రస్తుతం దీనిపైనే దర్శకుడు త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో సినిమాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నాగవంశీ, రాధాకృష్ణ నిర్మించనున్నారు.
మరి ఈ రూమర్ వార్తల్లో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే, త్రివిక్రమ్ దాన్ని అదే రేంజ్లో తీయగలిగితే సినిమా ఫలితాన్ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పొచ్చు.
read more:భారతరత్న కాలుగోటితో సమానం, బాలకృష్ణ వీడియో హల్చల్.. పద్మభూషణ్ అవార్డు ప్రకటన వేళ రచ్చ
also read: బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు, పద్మభూషణ్ పురస్కారంపై స్పందించని నాగ్?