Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అలాంటి అల్లు అర్జున్ పరువును సొంత తమ్ముడు అల్లు శిరీష్ పబ్లిక్ గా తీసేశాడు.

Icon Star Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నారు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ మూవీవల్ల ఆయన నటనకు ఫ్యాన్ కానివారు ఎవరూ ఉండేరేమో. ఉత్తరాదిన కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.ఇక.. బన్నీతో సినిమాలు చేయడానికి అందరు డైరెక్టర్లు క్యూ కట్టేస్తున్నారు.
కాగా, ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ గురించి ఆయన సొంత తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ టాక్ షోలో.. తన అన్న పరువు మొత్తం తీసేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...
అన్న పై కామెంట్...
గతంలో అల్లు శిరీష్.. నటుడు అలీ హోస్ట్ చేసిన ‘ అలీతో సరదాగా’ అనే ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చాడు. ఆ సమయంలో.. అల్లు అర్జున్ గురించి చాలా విషయాలు మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి తన అన్నయ్య బన్నీకి చదువు అంతగా రాదని సరదాగా చెప్పాడు.
‘ అమ్మ రాత్రంతా కూర్చోబెట్టి ఎంత చదివించినా, ఉదయానికి చదివింది మొత్తం మర్చిపోయేవాడు. అమ్మ ఎంత కష్టపడి చదివించినా.. పరీక్షల్లో ఏమీ రాసేవాడు కాదు’ అని అల్లూ శిరీష్ నవ్వుకుంటూ చెప్పడం విశేషం. ఈ వీడియో పాతదైనప్పటికీ.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. దీంతో... నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు, మరో వీడియోలో శిరీష్ తమ అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ గురించి పంచుకున్నాడు. తాను ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా.. బన్నీనే ముందు వేసుకునేవాడని, ఆ తర్వాత తాను వేసుకుంటే.. ‘ ఇది బన్నీ డ్రెస్ కదా.. నువ్వు వేసుకున్నావ్’ అని అందరూ తనను అడిగేవారు అని శిరీష్ చెప్పడం విశేషం.
రాకాగా రాబోతున్న అల్లు అర్జున్..
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ చివరగా పుష్ప2 తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు రాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవల మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండటం విశేషం. లుక్ తోనే మూవీపై ఆసక్తి పెరిగింది…
