అజయ్ దేవగన్, జాన్వీ, అర్జున్ కపూర్, బిగ్బీ.. కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు..రేట్ తెలిస్తే మతిపోతుంది!
అజయ్ దేవగన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, అమితాబ్ సెలబ్రిటీస్ తాజాగా కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు కొనుగోలు చేశారు. ఓకేసారి వీరంతా కొత్త హౌజ్లు కొనడం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మరి వాటి ధర తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, కాజోల్ జోడి భారీ ధర పెట్టి మరీ కొత్త బంగ్లాని కొనుగోలు చేశారు.
ముంబయిలోని జుహూ సమీపంలో దాదాపు 590 స్కైర్ యార్డ్స్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేయడం విశేషం. దీని ధర వింటేనే మతిపోతుంది.
ఈ కొత్త హౌజ్ కోసం అజయ్, కాజోల్ జోడి ఏకంగా 60కోట్లు ఖర్చు చేశారట. జుహూలోని కాపోల్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో ఉంటుందట. ఇక్కడే అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్షయ్ ధర్మేంద్ర వంటి స్టార్స్ నివాసం ఉంటున్నారు.
అంతేకాదు ప్రస్తుతం అజయ్ ఉంటున్న శక్తీ బంగ్లాకి సమీపంలోనే కొత్త హౌజ్ ఉంటుందని తెలుస్తుంది. మే మొదటి వారంలో దీని రిజిస్టర్ పూర్తయ్యిందని, అజయ్, ఆయన మదర్ వీనా పేర్లతో రిజిస్టర్ చేయించారట.
నిరుడు నుంచి అజయ్ కొత్త ఇంటి కోసం చూస్తున్నాడని, ఎట్టకేలకు ఈ కొత్త హౌజ్ని ఫైనలైజ్ చేశారని రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. దీని అసలు ధర దాదాపు 70కోట్లు కాగా, కరోనా ప్రభావంతో పది కోట్ల వరకు డిస్కౌంట్ ఇచ్చారని సమాచారం. అజయ్ దేవగన్ ప్రస్తుతం భార్య కాజోల్, కూతురు నైసా, కుమారుడు యుగ్లతో శక్తీ హౌజ్లో నివసిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ఇటీవల దాదాపు రూ.31కోట్లు పెట్టి అపార్ట్ మెంట్లో రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు.
వీరితోపాటు యంగ్ హీరో అర్జున్ కపూర్ సైతం 4 బెడ్ రూమ్ ప్లాట్ని కొన్నారు. తన ప్రియురాలు మలైకా అరోరాతో కలిసి త్వరలోనే ఈ ఇంట్లోకి వెళ్లబోతున్నారు అర్జున్. దీనికోసం ఆయన ఏకంగా 20కోట్లు ఖర్చు చేశారు. ఇది చాలా లగ్జరీగా ఉండబోతుందని సమాచారం.
మరోవైపు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా కొత్త ఇళ్లుని కొనుగోలు చేశారు. ఆమె 39కోట్లు పెట్టి జుహూలోనే ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.