ఐష్ ఎఫైర్ గురించి బయట పెట్టిన స్టార్ హీరోయిన్.. 25 ఏళ్లుగా వివాదం!
సినీ తారల జీవితాల్లో ఎన్నో గొప్ప అనుభవాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండాయి. ఒక్కొసారి ఆ చేదు జ్ఞాపకాలు వాళ్లను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఓ బాధకరమైన సంఘటన విశ్వ సుందరి జీవితంలోనూ ఉంది. 25 సంవత్సరాల క్రితం ఈ జరిగిన ఆ సంఘటన ఐష్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
తన అందం అభినయంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది అందాల భామ ఐశ్వర్య రాయ్. అయితే ఇంతటి అందాల రాశీ కూడా ఓ దశలో తిరస్కరణకు గురైందట.
1994లో ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది. అప్పట్లో మనీషా కొయిరాల కూడా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్థావించింది.
బాలీవుడ్లో ఐశ్వర్య ప్రయాణం అప్పుడే మొదలైంది. ఆ సమయంలో రాజీవ్ అనే వ్యక్తితో ఆమెకు ఎఫైర్ ఉండేదట, కానీ ఆ వ్యక్తి మనీషా పరిచయం అయిన తరువాత ఐశ్వర్యను రిజెక్ట్ చేశాడన్న వార్త అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వినిపించింది.
అయితే ఆ సమయంలో ఐశ్వర్య, రాజీవ్తో ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వార్తలు విషయంలో క్లారిటీ అడిగింది. ఈ తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజీవ్ నుంచి సమాధానం రాకపోవటంతో ఐశ్వర్య స్వయంగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది. మనిషా కొయిరాల అబద్ధాలు ప్రచారం చేస్తుందని, రాజీవ్ అనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
మేం ఇద్దరం చాలా మంచి స్నేహితులం అన్న ఐష్, మనీషా రోజు రోజుకూ తనకు దూరం అవుతుందని చెప్పింది.
ఈ ఘటన జరిగి 25 సంవత్సరాలు అవుతున్నా ఐశ్వర్య ఇంకా మర్చిపోలేెదు. అందుకే ఇన్నేళ్లలో ఈ ఇద్దరూ ఒకే వేదిక మీద కలిసి కనిపించిన సందర్భాలు లేవు.
ఐశ్వర్యతో తన వివాదం గురించి స్పందించేందుకు మనిషా కూడా ఇష్టపడలేదు.