`మహాసముద్రం`లో అదితి.. `ఆర్ఎక్స్ 100`ని మించి ఉంటుందా?
`వి` సినిమాతో ఇటీవల గ్లామరస్ పాత్రలో మెరిసిన అదితి రావు హైదరీ.. తాజాగా మరో తెలుగు సినిమాలో శర్వాతో రొమాన్స్ కి రెడీ అయ్యింది.
రెండేళ్ళ క్రితం `సమ్మోహనం` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదితి రావు హైదరీ `అంతరిక్షం`లో నటించింది. ఈ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` సినిమా చేసింది. ఇందులో నాని సరసన రొమాన్స్ చేసింది.
ఇప్పుడు హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు శర్వానంద్ సరసన రొమాన్స్ కి రెడీ అయ్యింది.
`ఆర్ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందే `మహాసముద్రం` సినిమాలో హీరోయిన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధార్గ్ మరో హీరో నటిస్తుండగా, అదితి పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో అదితి.. శర్వాతో రొమాన్స్ చేయనుందని టాక్. మరి `ఆర్ ఎక్స్ 100`లాగానే రొమాన్స్ అదిరిపోనుందనే టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర(అనిల్ సుంకర) నిర్మిస్తున్నారు.
తెలంగాణకు చెందిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు హిందీలో `ది గర్ట్ ఆన్ ది ట్రైన్`తోపాటు మరో సినిమా చేస్తుంది. తమిళంలో `హే సినామిక`, `తుగ్లక్ దర్బార్` చిత్రాల్లో నటిస్తుంది.