- Home
- Entertainment
- Devatha: మాధవను తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య.. కోపంతో రగిలిపోతున్న రాధ!
Devatha: మాధవను తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య.. కోపంతో రగిలిపోతున్న రాధ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 21 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ (bhagyamma)స్కూల్ దగ్గర పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి దేవీ చిన్మయి రావడంతో వారికి ఆ పండ్లను ఇస్తుంది. అప్పుడ భాష(basha)భాగ్యను చూసి అక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవడం అవసరమా అంటూ భాగ్యమ్మను అరుస్తాడు.
అప్పుడు భాష రుక్మిని బ్రతికే ఉంది అని చెప్పడంతో భాగ్యమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దేవుడమ్మ (devudamma)కు ఎవరో తెలిసిన వ్యక్తి చెప్పారు కానీ ఎక్కడ ఉందో తెలియదు అని భాష అనటంతో భాగ్యమ్మ ఊపిరి పీల్చు కుంటుంది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను కమల(kamala) కోసం ఇంటి దగ్గరికి రమ్మని చెప్పగా మళ్ళీ వస్తాను అని అంటుంది భాగ్యమ్మ.
మరొకవైపు దేవి(devi) ఇంట్లో మాధవ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే మాధవ అక్కడికి రావడంతో నువ్వు కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి ఫాదర్స్ డే సందర్భంగా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవి. మరొకవైపు రాధా(radha) పెళ్లి ఫోటో చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు ఆదిత్య(adithya)గురించి ఆలోచిస్తూ దేవి ని ఎలా అయినా మీకు ఇచ్చి నేను మరొకచోటికి వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది రాద. ఇక మరుసటి రోజు ఉదయాన్నే దేవి మళ్లీ మాధవ కోసం ఇల్లంతా వెతుకుతుంది. అప్పుడు మాధవ(madhava)కనిపించలేదు అని పిల్లలు ఇంట్లో వాళ్లకు చెప్పడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
అప్పుడు రాధ (radha)స్కూల్ కి పిల్లలు రెడీ అవమని చెప్పగా పిల్లలను వెళ్ళము నాన్న వచ్చాక వెళ్తాము అని అనడంతో అప్పుడు రాధ పిల్లలపై అరిచి స్కూల్ కి వెళ్ళడానికి రెడీ చేస్తుంది. ఇంతలోనే జానకి ఎమోషనల్ అవుతూ మాధవ(madhava)రాసిన లెటర్ ను చూసి బాధ పడుతూ ఉండగా అందరూ మాధవను వెతకడానికి ప్రయత్నిస్తారు.
ఇక ఆదిత్య (adithya)స్కూల్ దగ్గరికి వెళ్లి ఉండగా అక్కడ దేవి ఏడుస్తూ ఉండటంతో ఏమయింది అని అనగా తన నాన్న కనిపించడం లేదు అని దేవి(devi) అనడంతో అది షాక్ అవుతాడు. ఇక అప్పుడు ఆదిత్య మాధవన ఎలా అయినా వెతికి ఇస్తాను అని చెప్పి దేవి కి మాట ఇస్తాడు.