మహేష్ భార్యకు రష్మిక సర్ప్రైజ్ గిఫ్ట్
ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్గా టాప్ రేంజ్కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్టైన్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక మందన్న తన గత చిత్ర హీరో మహేష్ బాబు భార్యకు కొడగు నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
రష్మిక ఈ మాన్సూన్ సీజన్లో మహేష్ బాబు ఫ్యామిలీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
రష్మిక పంపిన గిఫ్ట్ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన నమ్రత, కృతజ్ఞతలు తెలియజేసింది.
మామిడి కాయ పచ్చడిని పంపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
కరోనా కాలంలో తొలి గిఫ్ట్ అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది నమత్ర.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుకు జోడిగా నటించింది రష్మిక. ఆ సమయంలోనే మహేష్ ఫ్యామిలీకి దగ్గరైంది.