బొక్కల్ తీస్తా ఒక్కొక్కడికి.. దరిద్రపు వెదవల్లారా.. రెచ్చిపోయిన మాధవీ లత
నటి మాధవి లత వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. తనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వివాదంలో తల దూర్చేసి కాంట్రవర్షియల్ కామెంట్స్తో రెచ్చిపోతోంది. రాజకీయాల్లోనూ సత్తా చాటాలనుకుంటున్న ఈ బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతోంది.
యామిని సాధినేని బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవి లత. మల్లెపూలు బాగా నలిపిందని పార్టీలోకి తీసుకున్నారా అంటూ ఈ భామ చేసిన కామెంట్స్ రాజకీయా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
మరో వివాదాస్పద నటి శ్రీరెడ్డితో మాధవి లత వివాదం చాలా కాలంగా సాగుతోంది. ఈ ఇద్దరు హద్దులు దాటి విమర్శించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికీ అడపాదడపా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
గతంలో ఒక సారి తనకు చచ్చిపోవాలని ఉంది అంటూ సంచలన పోస్ట్ చేసి అందరినీ కలవరపెట్టింది మాధవి లత. ఈ పోస్ట్ వైరల్ కావటంతో తరువాత నా కామెంట్ను ఫాలోవర్స్ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ సర్థి చెప్పే ప్రయత్నం చేసింది.
లాక్ డౌన్లో పెళ్లిళ్లు చేసుకున్న వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవీ లత. యంగ్ హీరో నిఖిల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ పేరు ప్రస్తావించకపోయినా అలా లాక్డౌన్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై స్పందించిన మాధవి లత. అస్సలు ఆగట్లేదుగా జనాలు మాస్కలు వేసుకొని పెళ్లిల్లు ఎందుకు అంటూ ప్రశ్నించింది.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది బ్యూటీ. ఓ కుర్రాడికి సాయం చేసేందుకు తాను పోస్ట్ చేసిన ఫోన్ నెంబర్కు ఫేక్ కాల్స్ చేయటంపై ఫైర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసిన మాధవీ లత, ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. పోలీసులమంటూ కాల్ చేసిన ఆ కుర్రాడని బెందిరించిన వారిపై ఓ రేంజ్లో రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.
అనవసరంగా ఆరోగ్యం బాలేని కుర్రాడిని ఇబ్బంది పెడతారా అంటూ... బొక్కల్ తీస్తా ఒక్కొక్కడికి.. దరిద్రపు వెదవల్లారా.. అంటూ ఘాటూ వ్యాఖ్యలతో వార్నింగ్ ఇచ్చింది. ఆ కుర్రాడి ఆవేదనను వాయిస్ మెసేజ్ల రూపంలో వినిపించి మరీ ఆ రేంజ్లో ఫైర్ అయ్యింది ఈ బ్యూటీ.