నాగ చైతన్య కిచెన్ లో వెంకటేష్ కూతురు.. బావా మరదళ్ల సరదా కబుర్లు
చైతు హీరోగా సినిమాలు చేస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు. నాగ చైతన్య 'షోయు' అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాడు. తన బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలని వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి బయట పెట్టే ప్రయత్నం చేసింది.

అక్కినేని నాగ చైతన్య చివరగా నటించిన థాంక్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయంగా నిలిచింది. తన నెక్స్ట్ మూవీతో ఎలాగైనా మంచి విజయం అందుకోవాలనే పట్టుదలతో చైతు ఉన్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
చైతు హీరోగా సినిమాలు చేస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు. నాగ చైతన్య 'షోయు' అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాడు. తన బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలని వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి బయట పెట్టే ప్రయత్నం చేసింది. షోయు కిచెన్ లో తన బావ నాగ చైతన్యతో ఆశ్రిత సరదాగా ముచ్చటించింది.
నాగ చైతన్యని బావ అని ముద్దుగా పిలుస్తూ ఆశ్రిత అనేక విషయాలు తెలుసుకుంది. నేను మీకు ఈరోజు షోయు గురించి అనేక విషయాలు చెప్పబోతున్నాను. మా చై బావతో మాట్లాడబోతున్నా అని మొదలు పెట్టింది. నాగ చైతన్యకి స్వీట్ హగ్ ఇచ్చి ఇంటర్వ్యూ మొదలు పెట్టింది.
షోయు గురించి తెలుసుకుంది. నాగ చైతన్య మాట్లాడుతూ షోయు అనేది రుచికరమైన జాపనీస్ ఫుడ్ కి తయారు చేయడం దీని ప్రత్యేకత. నేను నా ఫ్రెండ్స్ ముందుగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ లాక్ డౌన్ లో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం బాగా పెరిగింది. అందుకే షోయు ప్రారంభించాం అని నాగ చైతన్య తెలిపాడు.
తన ఇష్టమైన వంటకాల గురించి ఆశ్రితకు వివరించాడు. షోయు కిచెన్ మొత్తం తిరుగుతూ వీరిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆశ్రిత ఆ కిచెన్ లో తయారు చేసే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ని తన యూట్యూబ్ ఛానల్ లో చూపించింది.
ఆశ్రిత తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ చేసింది. బావా మరదళ్ల సరదా ముచ్చట్లని నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఆశ్రిత వివిధ రకాల అంశాలపై వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.