3 Idiots Sequel: పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్, అభిమానులకు పండగే..
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీల '3 ఇడియట్స్' సీక్వెల్ రాబోతోందని ప్రకటించారు. పదేళ్ల తర్వాత రాంచో, ఫర్హాన్, రాజుల కథ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారట.
16

Image Credit : instagram
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా
2009లో వచ్చిన '3 ఇడియట్స్' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ఇందులో నటించారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ ఓ క్లాసిక్.
Add Asianetnews Telugu as a Preferred Source

26
Image Credit : instagram
అభిమానులు కోరిక మేరకు..
ఈ సినిమా డైలాగ్స్, మ్యూజిక్, నటన అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అందుకే దీనికి సీక్వెల్ రావాలని దేశ వ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు '3 ఇడియట్స్ 2'పై వస్తున్న వార్తలు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
36
Image Credit : instagram
10 ఏళ్ల తరువాత ఏం జరిగింది?
ఇప్పుడు ఆమిర్ ఖాన్ స్వయంగా సీక్వెల్ గురించి ప్రకటించారు. పదేళ్ల తర్వాత రాంచో, ఫర్హాన్, రాజుల జీవితాల్లో ఏం జరిగిందనే కథాంశంతో 3 Idiots Sequel తెరకెక్కించబోతున్నట్టు ఆయన వివరించారు.
46
Image Credit : instagram
స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజ్ కుమార్ హీరానీ
అమర్ ఉజాలాతో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ సీక్వెల్ వివరాలు పంచుకున్నారు. 'నేను కథ విన్నాను, అది అద్భుతంగా ఉంది. రాజు (రాజ్ కుమార్ హిరానీ) ప్రస్తుతం '3 ఇడియట్స్ 2'పై పనిచేస్తున్నారు. కథ చాలా బాగుంది, కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరగాలి. మొదటి సినిమాలోని హాస్యం ఇందులోనూ ఉంటుంది. '3 ఇడియట్స్' తర్వాత పదేళ్లకు ఈ కథ మొదలవుతుంది' అని ఆమిర్ చెప్పారు.
56
Image Credit : instagram
ఆమిర్ ఖాన్ లో మునుపటి ఉత్సాహం
ఫున్సుఖ్ వాంగ్డు పాత్రలో మళ్లీ నటించడానికి ఆమిర్ ఖాన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 'ఇది రాజు, అభిజత్ కలిసి రాసిన మంచి కథ. ఫున్సుఖ్ వాంగ్డుగా మళ్లీ నటించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను' అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
66
Image Credit : instagram
అమీర్ ఖాన్ సినిమా కబుర్లు..
గతంలో ఆమిర్, రాజ్ కుమార్ హిరానీతో కలిసి దాదాసాహెబ్ ఫాల్కేపై ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, స్క్రిప్ట్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆమిర్ తెలిపారు. మరోవైపు, ఆష్నీర్ గ్రోవర్ బయోపిక్లో ఆమిర్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన 'ఏక్ దిన్' సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
Latest Videos

