- Home
- Entertainment
- Akhanda 2 ` గూస్బంమ్స్ అప్డేట్.. బాలయ్యకి విలన్గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?
Akhanda 2 ` గూస్బంమ్స్ అప్డేట్.. బాలయ్యకి విలన్గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?
Akhanda 2 Update: బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

balakrishna, akhanda 2, aadhi pinisetty
Akhanda 2 Update: బాలకృష్ణ `డాకు మహారాజ్` విజయం తర్వాత ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 14 రీల్స్ పతాకంపై బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతుంది.
సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన సెట్లో యాక్షన్ సీక్వెన్స్ లు రూపొందిస్తున్నారట. ఫైట్ మాస్టర్ రామ్, లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారట.
Akhanda
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలయ్య ఫ్యాన్స్ కి గూస్ బంమ్స్ తెప్పించే అప్ డేట్ వచ్చింది. ఇందులో విలన్గా ఆదిపినిశెట్టిని దించుతున్నాడట బోయపాటి. బాలయ్యని ఢీ కొట్టేందుకు ఆదిని దించినట్టు సమాచారం.
`అఖండ` సినిమాలో విలన్ బలంగా చూపించలేకపోయారు. రెగ్యూలర్గానే అనిపించాడు. బాలయ్య ముందు విలన్ పాత్రలు నిలవలేకపోయాయి. దీంతో తేలిపోయిన ఫీలింగ్ కలిగింది.
aadhi pinisetty
విలన్ పాత్రలు బలంగా లేకపోతే సీన్ రక్తికట్టడం కష్టం. సినిమా తేలిపోతుంది. అదే సమయంలో హీరోయిజం కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు అయితే బాగుంటుందని భావించిన బోయపాటి ఆది పినిశెట్టిని ఎంపిక చేశారట. అయితే ఇప్పటికే `సరైనోడు`లో విలన్గా నటింప చేశారు బోయపాటి.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆది పినిశెట్టి రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన పాత్ర సినిమాకే హైలైట్గా నిలిచింది. బన్నీతో పోరాడేందుకు `సరైనోడు` అనిపించాడు. అందుకే ఇప్పుడు `అఖండ 2`లో విలన్గా ఎంపిక చేసినట్టు సమాచారం.
akhanda
ఎంపిక చేయడమే కాదు, ఏకంగా షూటింగ్లోనూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య, ఆదిలపై యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వీరిద్దరి మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్లని డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలయ్య సినిమాకి యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే.
balakrishna
గతంలో `సింహా`ని మించి `లెజెండ్`లో, `లెజెండ్`ని మించి `అఖండ`లో చూపించారు బోయపాటి. ఇప్పుడు వాటిని మించి `అఖండ 2`లో చూపించబోతున్నారట. ఇక ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.