బర్త్ డే వేడుకలకి యువరాజ్ సింగ్ దూరం... తండ్రి వ్యాఖ్యలతో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ...
బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో విరుచుకుపడిన యువీ, క్యాన్సర్ మహమ్మరితో పోరాడి గెలిచి పట్టువదలని యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ భామలతో డేటింగ్ చేసిన ఈ లవర్ బాయ్, ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు. నేడు 39వ ఒడిలోకి అడుగుపెడుతున్న యువరాజ్ సింగ్, ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నాడు...
ఇంగ్లాండ్పై 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, టీ20 క్రికెట్ చరిత్రలో చిరకాలం నిలిచి ఉండిపోయే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు...
పార్టీలు, డ్యాన్సులతో ఫుల్లుగా ఎంజాయ్ చేసే యువరాజ్ సింగ్, ఈ ఏడాది ఎలాంటి వేడుకలు చేసుకోవడం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు...
‘పుట్టినరోజులు అనేవి కోరికలు నెరవేర్చుకోవడానికి ఓ అవకాశం లాంటివి... అయితే ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఒక కోరిక నెరువేర్చుకోవడానికే నిర్ణయించుకున్నాను...
ప్రభుత్వానికి, రైతులకి మధ్య నడుస్తున్న చర్చలు ఓ మంచి మార్పుని, ఓ గొప్ప విప్లవాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను...
మనదేశానికి రైతులే జీవనాధారం. అందులో ఎలాంటి అనుమానం లేదు... శాంతి చర్చలతో పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ లేదని కూడా నేను నమ్ముతాను...
భారతీయుడిగా పుట్టినందుకు గర్వించే నేను... నా తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో షాక్ అయ్యాను... ఆయన ఐడియాలజీ వేరు, నా ఆలోచనలు వేరు. నేను కూడా అలాగే ఆలోచించడం లేదని క్లారిటీ ఇస్తున్నా...
అలాగే కోవిద్ 19కి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పిన యువరాజ్ సింగ్, ఈ విపత్తు ఇంకా ముగిసిపోలేదని చెప్పారు...
వైరస్ మొత్తం అంతరించిపోయేదాకా జాగ్రత్త ఉండాలని చెప్పిన యువరాజ్ సింగ్... జై జవాన్, జై కిసాన్.. జై హిందూ అంటూ సుదీర్ఘ లేఖను ముగించారు...
యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ... ‘రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా క్రీడాకారులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని’ డిమాండ్ చేశారు...
‘కేంద్ర ప్రభుత్వం రైతులను అర్థం చేసుకోవాలి. వారితో సానుకూలంగా వ్యవహారించాలి. రైతుల ఉద్యమంలో నిజం ఉంది. రైతుల ఆందోళనలకు మద్ధతుగా కొందరు క్రీడాకారులు కూడా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు యోగ్రాజ్ సింగ్.
అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారని యోగ్రాజ్ సింగ్ చేసిన కామెంట్, యువరాజ్ సింగ్ను ఉద్దేశించే అని భావించారంతా. అయితే పుట్టినరోజున దీనిపై క్లారిటీ ఇచ్చాడు యువీ.
304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 మ్యాచులు ఆడిన యువరాజ్ సింగ్... 11 వేలకు పైగా పరుగులు సాధించాడు.
2012లో ‘అర్జున అవార్డు’ గెలుచుకున్న యువరాజ్ సింగ్... 2014లో ‘పద్మశ్రీ’ పురస్కారం పొందాడు.