MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • WI vs IND: మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యమే.. కారణం చెప్పిన విండీస్ క్రికెట్ బోర్డ్

WI vs IND: మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యమే.. కారణం చెప్పిన విండీస్ క్రికెట్ బోర్డ్

WI vs IND T20I: వెస్టిండీస్‌తో రెండో టీ20  అనుకున్న సమయానికంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నేడు జరగాల్సి ఉన్న మూడో టీ20 కూడా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నది. 

2 Min read
Author : Srinivas M
Published : Aug 02 2022, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ నిర్వహణ  విమర్శలకు తావిస్తున్నది. సోమవారం ముగిసిన రెండో టీ20 జరగాల్సిన సమయం కంటే 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.  దీంతో భారత కాలమానం ప్రకారం.. 8 గంటలకు ప్రారంభంకావాల్సి ఉన్న మ్యాచ్.. 11 గంటలకు మొదలైంది. భారత్ లో ఈ మ్యాచ్ మంగళవారం తెల్లవారుజామున 2.40కు ముగిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెండో టీ20కి ముందు భారత ఆటగాళ్ల లగేజీ రాకపోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది.  మూడు గంటల పాటు మ్యాచ్ ను ఆపినా సూర్యకుమార్ యాదవ్,  దీపక్ హుడా, అవేశ్ ఖాన్ ల లగేజీలు అందనే లేదు. దీంతో వాళ్లు అర్ష్‌దీప్ జెర్సీ వేసుకుని బరిలోకి దిగాల్సి వచ్చింది. 

37

ఇక తాజాగా మూడో టీ20 కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుందని  విండీస్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటన విడుదలచేసింది. షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు  ప్రారంభం కావాల్సి ఉన్న మ్యాచ్.. 90 నిమిషాల పాటు (గంటన్నర) ఆలస్యంగా మొదలవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

47

మూడో మ్యాచ్ కు  ఆటగాళ్లకు కావాల్సిన విశ్రాంతిని ఇచ్చిన తర్వాతే ఈ మ్యాచ్ ను ప్రారంభిస్తామని  ఆటగాళ్లకు విండీస్ క్రికెట్ బోర్డు ముందే చెప్పిందట. దీనికి వాళ్లు ఒప్పుకున్నాకే రెండో మ్యాచ్ జరిపించిందట. అందుకే నేటి మ్యాచ్ ను భారత కాలమానం ప్రకారం 8 గంటలకు బదులు 9.30 గంటలకు ప్రారంభం కానుంది. 

57

‘విండీస్-ఇండియా మధ్య జరిగే మూడో మ్యాచ్ కూడా  ఆలస్యమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు  అధికారికంగా తెలిపింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు మొదలవుతుంది. సోమవారం మ్యాచ్ ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. 

67
Image credit: Getty

Image credit: Getty

అయితే ఈ మ్యాచ్ కు ముందే.. మేము మూడో మ్యాచ్ కు కావాల్సినంత విశ్రాంతినిస్తామని ఆటగాళ్లకు మాటిచ్చాం. దాంతో ఇరుజట్లు మ్యాచ్ ఆడేందుకు సమ్మతించాయి..’ అని వెస్టిండీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. 
 

77

ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసిన ఈ ఐదు మ్యాచుల సిరీస్ లో చెరో విజయంతో సిరీస్ ను 1-1తో పంచుకున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించడంతో పాటు ముందంజ వేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ కీలకం కానున్నది. 
 

About the Author

SM
Srinivas M
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved