MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • WI vs IND: మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యమే.. కారణం చెప్పిన విండీస్ క్రికెట్ బోర్డ్

WI vs IND: మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యమే.. కారణం చెప్పిన విండీస్ క్రికెట్ బోర్డ్

WI vs IND T20I: వెస్టిండీస్‌తో రెండో టీ20  అనుకున్న సమయానికంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నేడు జరగాల్సి ఉన్న మూడో టీ20 కూడా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నది. 

2 Min read
Srinivas M
Published : Aug 02 2022, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ నిర్వహణ  విమర్శలకు తావిస్తున్నది. సోమవారం ముగిసిన రెండో టీ20 జరగాల్సిన సమయం కంటే 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.  దీంతో భారత కాలమానం ప్రకారం.. 8 గంటలకు ప్రారంభంకావాల్సి ఉన్న మ్యాచ్.. 11 గంటలకు మొదలైంది. భారత్ లో ఈ మ్యాచ్ మంగళవారం తెల్లవారుజామున 2.40కు ముగిసింది. 

27

రెండో టీ20కి ముందు భారత ఆటగాళ్ల లగేజీ రాకపోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది.  మూడు గంటల పాటు మ్యాచ్ ను ఆపినా సూర్యకుమార్ యాదవ్,  దీపక్ హుడా, అవేశ్ ఖాన్ ల లగేజీలు అందనే లేదు. దీంతో వాళ్లు అర్ష్‌దీప్ జెర్సీ వేసుకుని బరిలోకి దిగాల్సి వచ్చింది. 

37

ఇక తాజాగా మూడో టీ20 కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుందని  విండీస్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటన విడుదలచేసింది. షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు  ప్రారంభం కావాల్సి ఉన్న మ్యాచ్.. 90 నిమిషాల పాటు (గంటన్నర) ఆలస్యంగా మొదలవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

47

మూడో మ్యాచ్ కు  ఆటగాళ్లకు కావాల్సిన విశ్రాంతిని ఇచ్చిన తర్వాతే ఈ మ్యాచ్ ను ప్రారంభిస్తామని  ఆటగాళ్లకు విండీస్ క్రికెట్ బోర్డు ముందే చెప్పిందట. దీనికి వాళ్లు ఒప్పుకున్నాకే రెండో మ్యాచ్ జరిపించిందట. అందుకే నేటి మ్యాచ్ ను భారత కాలమానం ప్రకారం 8 గంటలకు బదులు 9.30 గంటలకు ప్రారంభం కానుంది. 

57

‘విండీస్-ఇండియా మధ్య జరిగే మూడో మ్యాచ్ కూడా  ఆలస్యమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు  అధికారికంగా తెలిపింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు మొదలవుతుంది. సోమవారం మ్యాచ్ ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. 

67
Image credit: Getty

Image credit: Getty

అయితే ఈ మ్యాచ్ కు ముందే.. మేము మూడో మ్యాచ్ కు కావాల్సినంత విశ్రాంతినిస్తామని ఆటగాళ్లకు మాటిచ్చాం. దాంతో ఇరుజట్లు మ్యాచ్ ఆడేందుకు సమ్మతించాయి..’ అని వెస్టిండీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. 
 

77

ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసిన ఈ ఐదు మ్యాచుల సిరీస్ లో చెరో విజయంతో సిరీస్ ను 1-1తో పంచుకున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించడంతో పాటు ముందంజ వేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ కీలకం కానున్నది. 
 

About the Author

SM
Srinivas M
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
Recommended image2
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Recommended image3
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved